కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై ఆంధ్రరాష్ట్రంలో వ్యతిరేకత

కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై ఆంధ్రరాష్ట్రంలో వ్యతిరేకత
X
ప్రవర్తన మార్చుకోక పోతే ఉద్వాసన ఖాయం అన్న చంద్రబాబు

వైసీపీ అరాచకా పాలనకు చరమగీతం పాడుతూ ఎప్పుడూ లేనటువంటి మెజార్టీలతో ఎమ్మెల్యేలను గెలిపించి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి పాలన కొంచం నిరుత్సహం ఇస్తుంది అంటున్నాయి సర్వే రిపోర్ట్స్.

కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఏడాది కావొస్తున్నా తరుణం లో సీఎం చంద్రబాబు సర్వే నిర్వహించారు,ఈ సర్వే లో అనుకోని విధంగా వచ్చిన రిపోర్ట్స్ గాను సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేసారు.అత్యధిక ఓట్ల తో గెలిపించిన ఏపీ ప్రజలు ఇందుకు బిన్నంగా 64 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్టు సర్వేలో తేలింది.దీనికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లే కారణం అని తెలిసింది.

ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్వహించిన సర్వేలో 90 మంది ఎమ్మెల్యేలు ఆరంజ్ జోన్ లోను 53 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోనులోను ఉన్నారు.కేవలం 32 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్న వారిలో ఉన్నారు.

రైజ్ సర్వేలో ఇదే ధోరణి కనిపించింది,ఇక్కడ కూటమి ప్రభుత్వానికి కొంచం ఊరట ఇచ్చే అంశం ఏదన్నా ఉంది అంటే గత ప్రభుత్వ వైసీపీ పాలనకంటే 54 శాతం జనాభా బాగుంది అనటం ,24 శాతం మంది తటస్థంగా ఉండటం.

కూటమి ప్రభుత్వ వ్యతిరేకతకు కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు,ప్రజా సమస్యలను పట్టించుకోకపోవటం,భూదందాలు మైనింగ్ మాఫియాలు ,అక్రమవసూళ్ల కారణంగా సర్వే తేల్చిచెప్పింది.ఎమ్మెల్యేల పనితీరులో నిస్వార్ధంగా పనిచేస్తున్న వాళ్లలో మొదటిగా సీఎం చంద్రబాబు నాయుడుగారు తరువాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు లోకేష్,నిమ్మల రామానాయుడు ,పి నారాయణ ,పయ్యావుల కేశవ్ మాత్రమే ఉన్నారు.

కూటమి ప్రభుత్వం త్వరగా లోటుపాట్లను సరిచేసుకోకపోతే రాబోయే ఎన్నికల్లో వ్యతిరేకత కాయం అని తెలుస్తుంది.ఇప్పటికే చంద్రబాబు ఎమ్మెల్యేల అందరికి తమ తప్పులు తెలుసుకుని ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం ఉండకూడని హెచ్చరించినట్టు తెలుస్తుంది.

Tags

Next Story