"తనేజా ఎరోస్పేస్"రాకతో ఆంధప్రదేశ్ ను “ఏవియేషన్ హాబ్” తీర్చిదిదుతాం అంటున్న మంత్రి

చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు నమ్మకం వచ్చి ఆంధ్రరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.పెట్టుబడుదారులకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం సహకారం చేస్తుండటంతో, తనేజా ఎరోస్పేస్ విమాన తయారీ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాబోతుంది అన్నారు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి.యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా.. పెట్టుబడిదారుల అనుకూల విధానాలు, రాయితీలు ప్రభుత్వం కలిపిస్తుంది అన్నారు.
ఆంధప్రదేశ్ ను “ఏవియేషన్ హాబ్” గా తీర్చిదిద్దేందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.గతంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకడుగు వేసిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు సైతం నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రెట్టించిన ఉత్సాహాంతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అందులో భాగంగా నేడు విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో తనేజా ఏరో స్పేస్ సంస్థ ప్రతినిధులు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ఆసక్తిని వ్యక్తపరచడం జరిగింది. ఈ సందర్భంగా, తనేజా ఏరోస్పేస్ సంస్థ యొక్క సమగ్ర ప్రాజెక్ట్ వివరాలను మంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.. తనేజా ఏరో స్పేస్ సంస్థ పెట్టుబడుల లక్ష్యాలు మరియు రాష్ట్రానికి రాబోయే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై సమగ్రమైన ప్రెజెంటేషన్ మంత్రికి సంస్థ ప్రతినిధులు సమర్పించడం జరిగింది.
ప్రముఖ విమానయాన తయారీ సంస్థ తనేజా ఏరోస్పేస్ & ఏవియేషన్ లిమిటెడ్ (TAAL) రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చడం.రాబోయే రోజుల్లో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఇది మరో కీలక మైలురాయిగా మిగిలిపోతుందని సంతోషం వ్యక్తం చేశారు.విమాన తయారీ రంగంలో ఎంతో అనుభవం ఉన్న తనేజా ఏరోస్పేస్ రాష్ట్రంలో 12 సీట్ల సామర్థ్యం గల విమానాల (ప్రైవేట్ జెట్) తయారీ యూనిట్ను మరియు టాల్ టేక్ విమాన సాఫ్ట్ వేర్ కంపెనీని స్థాపించేందుకు ముందుకు రావడం ఒక ఆహ్వానించదగిన పరిణామంగా మంత్రి అభివర్ణించారు..
తనేజా ఏరోస్పేస్ యూనిట్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో హై-టెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో కీలక అభివృద్ధి సాధ్యమవుతుందని, స్థానికంగా యువతకు నైపుణ్యాభివృద్ధి మరియు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
-
Home
-
Menu