జోరుగా సాగుతున్న గంజాయి సాగు...అనకాపల్లిలో పట్టుకున్న 369 కేజీలు

గత ప్రభుత్వం లో జరిగిన విపరీతమైన గంజాయి సాగు కూటమి ప్రభుత్వం వచ్చేకా కూడా నివారించలేక పోతుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి నక్కపల్లి జాతీయ రహదారి దగ్గర పెద్దఎత్తున గంజాయిని పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.
పోలిసుల విధినిర్వహణ లో బాగంగా మంగళవారం రాత్రి జాతీయ రహదారి లో తనిఖీలు నిర్వహించారు.అనుమానాస్పదంగా రెండు కార్లు పోలీసులు అవుతున్న వాహనాల్ని ఢీకొట్టుకుంటూ వెళ్ళిపోయి ఆగిపోయేసరికి పోలీసులు హుటాటీన దుండగుల్ని పట్టుకున్నారు.డ్రైవర్ ఒకరు పరారు అవ్వగా మిగతా వారిని పట్టుకున్నారు.వారిని ఢిల్లీకి చెందిన వారిలా గుర్తించారు.రెండు కార్లలోనూ 369 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసిన గంజాయి సాగును పూర్తిగా నిరోధించలేకపోతున్నారు.ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఈ సాగు ఎక్కువగా జరుగుతుండటం వల్ల పోలీసుల కు కూడా నివారించడం సవాలుగా మారింది.
-
Home
-
Menu