ఏపీ మీ సేవ కంద్రంలో భారీ నకిలీ ఈ - స్టాంప్ విక్రయాలు, చరిత్ర పునరావృతం

ఏపీ  మీ సేవ కంద్రంలో భారీ నకిలీ ఈ - స్టాంప్ విక్రయాలు, చరిత్ర పునరావృతం
X
1992 తరహా భారీ స్టాంప్ ల కుంభకోణం...! అప్పుడు నకిలీ స్టాంప్ పేపర్ల ఇప్పుడు ఈ-స్టాంప్‌లు

1992 - దేశాన్ని కుదిపేసిన అతిపెద్ద కుంభకోణం మరలా పునరావృతం అవుతున్నట్లుంది,ముప్పై మూడేళ్ల క్రితం దేశచరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా చరిత్రకెక్కింది నకిలీ స్టాంప్ పేపర్ల స్కాం.

సాధారణంగా రైళ్లలో పల్లీలు అమ్ముకునే ఒక సాధారణ మనిషి, అబ్దుల్ కరీం తెల్గీ, పకడ్బందీగా నకిలీ స్టాంప్ పేపర్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి, మూడున్నర దశాబ్దాల కిందట 30,000 కోట్లకు పైగా నష్టం కలిగించాడు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యవస్థను, బ్యాంకులను, కోర్టులను మోసం చేసిన అతడి మాయాజాలం నాటి ప్రభుత్వాలను ఊగదీసింది.

ఈ స్కాం బారిన పడినవారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒకటి.ఆ సమయంలో మంత్రిగా ఉన్న కృష్ణ యాదవ్ ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్టుగా ఆరోపణలు వచ్చి, ఏళ్లపాటు జైలు పాలయ్యాడు.

ముప్పై మూడేళ్ల క్రితం దేశం చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా చరిత్రకెక్కింది — నకిలీ స్టాంప్ పేపర్ల స్కాం.

సాధారణంగా రైళ్లలో పల్లీలు అమ్ముకునే ఒక సాధారణ మనిషి, అబ్దుల్ కరీం తెల్గీ, పకడ్బందీగా నకిలీ స్టాంప్ పేపర్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి, మూడున్నర దశాబ్దాల కిందట 30,000 కోట్లకు పైగా నష్టం కలిగించాడు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యవస్థను, బ్యాంకులను, కోర్టులను మోసం చేసిన అతడి మాయాజాలం నాటి ప్రభుత్వాలను ఊగదీసింది.

ఈ స్కాం బారిన పడినవారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒకటి.ఆ సమయంలో మంత్రిగా ఉన్న కృష్ణ యాదవ్ ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్టుగా ఆరోపణలు వచ్చి, ఏళ్లపాటు జైలు పాలయ్యాడు.

2025 లో కూడా స్టాంప్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది ఈసారి నకిలీ పేపర్ లేదు... కానీ నకిలీ ఈ-స్టాంప్ ఉంది

ఏపీ రాష్ట్రంలో ఓ మీ సేవా ఆపరేటర్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ ఈ-స్టాంప్‌లను ఫోర్జరీ చేసి వేలాదిగా విక్రయించాడు.ఈ చర్య ఇప్పుడు కొత్తగా మరో భారీ కుంభకోణాన్ని తెరపైకి తీసుకువచ్చింది.అప్పుడు పేపర్లు నకిలీ...ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే నకిలీ... ఉమ్మడి రాష్ట్రాన్ని ఊగదీసింది,ఇప్పుడు విభజిత రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది.

అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోనే ఉండేది,ఇప్పుడూ టీడీపీ కూటమి అధికారంలోనే ఉంది,అప్పుడు ఓ మంత్రి జైలు పాలయ్యాడు..ఇప్పుడు...? ఎవరు బయటపడతారో కాలమే సమాధానం చెప్పాలి.చరిత్ర పునరావృతమవుతుందా లేక మాసిపోయిన చరిత్రను చూసి అయిన పాఠాలు నేర్చుకోకుండా మరలా అదే దారిలో పోతున్నామా ఒకసారి ఆలోచించాలి.

Tags

Next Story