ఉత్తరాదిన భూప్రకంపనలు – ప్రజలలో భయాందోళనలు

ఉత్తరాదిన భూప్రకంపనలు – ప్రజలలో భయాందోళనలు
X
ఢిల్లీ సమీపంలో 4.1 తీవ్రతతో భూకంపం - ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు

ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈరోజు ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రోడ్లపైకి వచ్చి సురక్షిత ప్రదేశాల్లో నిలబడ్డారు.

భూకంప కేంద్రం ఢిల్లీకి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. ఇది హర్యానాలోని సోనిపట్ ప్రాంతానికి సమీపంగా ఉండొచ్చని భూగర్భ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదైంది.

ఇప్పటికే అధికారులు అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదు. కానీ భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని సూచిస్తున్నారు.

Tags

Next Story