తెలంగాణాలో ఈగల్ ఏక్షన్ గ్రూప్...డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం సీఎం రేవంత్

ఈ రోజు ప్రపంచ యాంటీ నార్కోటిక్ డే సందర్భంగా తెలంగాణ సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఇకనుంచి తెలంగాణ రాష్ట్రము లో ఎటువంటి మాదకద్రవ్యాల ఉండకూడదు అన్నారు.డ్రగ్స్ గంజాయి వంటి మాదక ద్రవ్యాలు నిర్ములన కోసం నేటి నుంచి పనిమొదలు పెట్టాం అని తెలియచేసారు.ఈ సందర్భంగా ఈగల్ ఎలైట్ ఏక్షన్ గ్రూప్ అఫ్ లా ని ప్రారంభించారు.
తెలంగాణ భూభాగంలో ఒక్క గంజాయి మొక్క మొలిచిన,డ్రగ్స్ తో రాష్ట్రము లోకి ప్రవేశించిన ఇకపై ఈగల్ నిశితంగా గమనిస్తుంది అన్నారు సీఎం రేవంత్.శిక్షణ పొందిన గద్దలు తెలంగాణ భూభాగం పై నిత్యం గమనిస్తూనే ఉంటాయి అన్నారు,గంజాయిని గమనించిన, డ్రగ్స్ ఆనవాళ్లు పరిశీలించిన క్షణంలో పసికటేస్తాయి అని హెచ్చరించారు.డ్రగ్స్ రహిత తెలంగాణాలో పాలుపంచుకోవడం లో ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియచేసారు.ఇకనుంచి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పేరు ఈగిల్ ఏక్షన్ బ్యూరో అని తెలియచేసారు.
-
Home
-
Menu