మెట్రో పొలిటిన్ సిటీస్ లో నడుస్తునా డ్రగ్స్ దందా

హైద్రాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాలలో డ్రగ్స్ మాఫియాని కట్టడి చేయలేక పోతున్నాము.గంజాయి మొదలగు మాదకద్రవయాలను యువతికి అలవాటు చేసి వాళ్ళని మత్తుకి బానిసను చేస్తున్నారు.ఈ మధ్య గంజాయి లాంటి మాదకద్రవ్యాన్ని హ్యాష్ ఆయిల్ రూపంలో తయారుచేసి ఎక్కువ డబ్బులకు విక్రయిస్తున్నారు.ఈ మధ్య యువత ఈ హ్యాష్ ఆయిల్ కొనడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపటం తో దీని విక్రయాలు మరింత పెరిగాయి.
శంషాబాద్ లో హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేసారు.వారి దగ్గర నుంచి 500 గ్రాముల ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఆయిల్ ఎక్కడ నుంచి వస్తుంది అని పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు.
ఈ హ్యాష్ ఆయిల్ వల్ల అధిక మత్తు ఇవ్వటంతో యువత మరియు బడాబాబులు కూడా దీనిని అధిక మొత్తం చెల్లించి కొంటున్నారు.దీని వల్ల మెట్రో పొలిటిన్ సిటీస్ లోనే కాక పెద్ద చిన్న నగరాలలో కూడా క్రైమ్ శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.
Tags
-
Home
-
Menu