పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయండి, జెన్కో డైరెక్టర్ సుజయ్ కుమార్

పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయండి, జెన్కో డైరెక్టర్ సుజయ్ కుమార్
X
పోలవరం హైడ్రోస్టేషన్‌లో 150/30 టన్నుల క్రేన్ ప్రారంభం, టర్బైన్, జనరేటర్ స్థాపనకు కీలకంగా కొత్త క్రేన్

పోలవరం ప్రధాన ప్రాజెక్టు పనులకు అనుగుణంగా హైడ్రోఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ నిర్మాణం కూడా పూర్తి కావాలని ఏపీ జెన్కో డైరెక్టర్ (హైడల్) శ్రీ ఎం. సుజయ్ కుమార్ గారు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన పోలవరం హైడ్రోఎలక్ట్రిక్ స్టేషన్‌లో 150/30 టన్నుల సామర్థ్యం గల క్రేన్‌ను ప్రారంభించారు. ప్రారంభానికి ముందు పూజ నిర్వహించారు. క్రేన్ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ప్రధాన భాగాలైన టర్బైన్లు, జనరేటర్లు స్థాపించేందుకు ఈ ఎలక్ట్రిక్ ట్రావెలర్ ఓవర్‌హెడ్ క్రేన్ ఉపయోగపడనుందని తెలిపారు.

జెన్కో అధికారులతో పాటు కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. డయాఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ పనులతో పాటు హైడ్రోపవర్ స్టేషన్ పనులు కూడా సమాంతరంగా కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ సతీష్ బాబు అంగర తెలిపారు. త్వరలోనే 225/40 టన్నుల సామర్థ్యం గల రెండు భారీ క్రేన్‌లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. టర్బైన్‌లు, జనరేటర్ల స్థాపన పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆయన డైరెక్టర్ సుజయ్ కుమార్‌కు తెలియజేశారు. ఇప్పటికే 8 జనరేటర్లు ప్రాజెక్ట్ సైట్‌కు చేరినట్లు తెలిపారు.

Tags

Next Story