అమరావతిలో తొలివెలుగు సంబరాలు జరుపుకున్న కూటమి ప్రభుత్వం

అమరావతిలో తొలివెలుగు సంబరాలు జరుపుకున్న కూటమి ప్రభుత్వం
X
కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి ఆయన సందర్భంలో అమరావతిలో సభ

ఆంధ్రరాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు అమరావతిలో తొలివెలుగు పేరుతో భారీ సభ నిర్వహిస్తున్నారు.మూడు పార్టీల అధ్యక్షులు జ్యోతి ప్రజ్వళనగావించి మా తెలుగుతల్లీ గీతం తో సభను ప్రారంభించారు.గత ఐదు సంవత్సరాల పాలనలో మనం ఈ గీతాన్ని వినివుండం.ఈ సభకు టీడీపీ పార్టీ అధ్యక్షులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు,జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు,పార్లమెంటరీ మెంబెర్ బీజేపీ పార్టీ అధినేత పురందేశ్వరి గారు,మంత్రి నారా లోకేష్ మరియు మంత్రులు ఎమ్మెల్యే లు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

మంత్రి నారాలోకేష్ మాట్లాడుతూ తొలిఅడుగు పేరుతో నిర్వహిస్తున్న ఈ సభ వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడి చీకటి నుంచి వెలుగుకి వచ్చి సంవత్సరకాలం అయింది అన్నారు.ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో పది లక్షల కోట్లు అప్పులు అయ్యాయి కానీ రాష్ట్రానికి ఎంటువంటి అభివృద్ధి జరగలేదు అని ద్వగమెత్తారు.ఈ ఐదు ఏళ్లలో రాష్ట్రా అభివృద్ధి కన్నా జగన్మోహన్ రెడ్డి పేలస్ లా అభివృద్ధి బాగా జరిగింది అన్నారు.కేవలం ఒక వ్యక్తి కోసం 7000 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టారు అని దుయ్యపెట్టారు.గత ప్రభుత్వ పాలనలో ప్రాజెక్టులు ఏమి రాలేదు దేశం లో ఎక్కడైనా పెడతాం కానీ ఆంధ్రరాష్ట్రం లో వద్దు అని వెళ్లిపోయారు అన్నారు.

కడప స్టీల్ ప్లాంట్కు రెండు సార్లు శంకుస్థాపన అయితే చేసారు కానీ అక్కడ ప్లాంట్ నిర్మించే ప్రయత్నం చేయలేక పోయారు అని విమర్శించారు.గత ప్రభుత్వ అరాచకపాలనలో దళిత డ్రైవర్ ని డోర్ డెలివరీ ,covid సమయం లో మాస్కులు అడిగిన పాపానికి ఒక డాక్టర్ని హింసించి చంపడమే కాకుండా అమర్నాధ్ గౌడ్ అనే వ్యక్తి కంప్లైన్ట్ ఇచ్చాడు అనే కోపం తో పెట్రోల్ పోసి తగలబెట్టారు తీవ్రంగా ధ్వజమెత్తారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రం నుంచి విశాఖ ఉక్కుకి గాను 11500 కోట్లు మంజూరు ,విశాఖ రైల్వేజోన్ మరియు భోగాపురం విమానాశ్రయం పనులు కూటమి ప్రభుత్వం ద్వారా సాధ్యం అయింది అన్నారు.

తరువాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ అరాచకాలను రాక్షస పాలనను తందాన శైలిలో విమర్శించారు.వైస్సార్ ప్రభుత్వం లో అధికార వ్యవస్థ యంత భయం గుపెట్లో నలిగి పోయిందో ఈ సంవత్సర కాలంలో తెలిసింది అన్నారు.రాజకీయ పాలన రాక్షస పాలనలో కొనసాగితే అధికారుల చేతికి వాళ్ళ అధికారం ఇవ్వక పోతే ఆంధ్రరాష్ట్రా పరిస్థితి ఏవిధముగా మారిందో ఎన్ని అక్రమాలు ఎన్ని అక్రమ వ్యాపారాలు జరిగాయో వివరించారు పవన్.దశబ్ద అనుభవం కలిగిన చంద్రబాబు తో కలవటం రాష్ట్రన్ని అభివృద్ధి పదంగా నడిపించాలి అని చంద్రబాబు ని కొనియాడారు.

వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో అవినీతి అక్రమాలు తప్ప అభివృద్ధి జరగలేదు అన్నారు.దశాబ్ద కాలం ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తిని జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేసారు అని గుర్తుచేశారు.2023 విశాఖ పర్యటనలో నాకు తీవ్రమైన అడ్డంకులు కలిగించారు అని,అప్పుడే అనిపించింది అంధకారం లో ఉన్న ఈ రాష్ట్రానికి వెలుగు వస్తుందా అని అనిపించింది అన్నారు.పాలనా వ్యవస్థ సక్రమంగా లేకపోతే అధికారులు కూడా తమ విధులను సక్రమంగా నిర్వహించారు అన్నారు.పాలన అనేది స్వార్ధపూరితం కాకుండా ప్రజల రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేయాలి అని అక్కడ ఉన్న శాసనసభ్యులు ,పార్లమెంట్ సంభ్యులకు హితవు పలికారు.

Tags

Next Story