క్రమశిక్షణ తప్పితే వేటు తప్పదు అన్న సీఎం రేవంత్

క్రమశిక్షణ తప్పితే వేటు తప్పదు అన్న సీఎం రేవంత్
X
మంత్రుల ప్రవర్తన ఫై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

గాంధీ‌భవన్‌లో జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పని చేయకపోతే డిమోషన్ తప్పదు అని స్పష్టం చేశారు. పని చేయకపోతే పక్కన పెట్టడంలో మొహమాటం అవసరం లేదని తేల్చిచెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి.స్థానిక సంస్థల ఎన్నికల్లో 99 శాతం సీట్లు గెలిచేలా ఇన్‌చార్జ్ మంత్రులే బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులకు నిధులు ఇచ్చామని, వాటిని సరిగ్గా ఎందుకు ఆయా జిల్లాల్లో సద్వినియోగం చేసుకోవటం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేసారు.

పార్టీలో క్రమశిక్షణ దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. పదవులు వచ్చినవారు తెలంగాణ రాష్ట్రమంతా తిరగాలని ఆదేశించారు.ఇటీవల కొండా సురేఖ మీద అధిష్టానం ఎంక్వయిరీ వేయటం మంత్రులు ఇష్టానుసారంగా ఉండటం తో సీఎం రేవంత్ పార్టీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

త్వరలోనే మహిళా రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 2029 ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. పార్టీలో పనిచేయని వారిని పదవుల నుంచి తొలగించాలని ఆదేశించారు. తెలంగాణలో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రావాలంటే.. పార్టీ నేతల పనితీరుపైనే ఆధారపడి ఉందని తేల్చిచెప్పారు.

పదేళ్లు అధికారం మనదేనని స్పష్టం చేశారు. పార్టీ పదవిని చిన్నచూపు చూస్తే వారికే నష్టమని హెచ్చరించారు.పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్లో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పని చేస్తేనే పదవులు వస్తాయని చెప్పారు. పార్టీకి కష్టకాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చామని ఉద్ఘాటించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని పార్టీ నాయకులు పని చేయాలని సూచించారు. మార్కెట్ కమిటీలు, టెంపుల్ కమిటీల వంటి నామినేటేడ్ పోస్టులు భర్తీ చేసుకోవాలని ఆదేశించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలి ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయని వెల్లడించారు.మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా నేతలు అందరూ కలిసి పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్లో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

Tags

Next Story