అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా చంద్రబాబు కీలక నిర్ణయం

ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకుంది.గతంలో చేసిన భూకేటాయింపులలో చిన్న చిన్న మార్పులు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది.ఏపీ అమరావతి నిర్మాణం కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘము ఈ రోజు కొన్ని ముఖ్య సంస్థలకు భూములను కేటాయించింది.
మంత్రులు భరత్ , పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, నారాయణ కూడా హాజరయ్యారు.ఈ భేటీలో ఒక్కపుడు టీడీపీ కేటాయించిన భూములతో పాటు కొన్ని కొత్త సంస్థల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి.ఈ భేటీలో 16 సంస్థల పేర్లు ప్రస్తావనికి వస్తే 12 సంస్థలను ఆమోదించారు.2014-2019 కాలంలో ప్రస్తావించిన సంస్థలలో నాల్గింటిని మాత్రమే కొనసాగిస్తున్నారు.అందులో భాగంగా సిబిఐ కి రెండు ఎకరాలు ,జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కి రెండు ఎకరాలు,రాష్ట్ర ఫోరెన్సెక్ సైన్స్ ల్యాబ్ కు ఎకరాలు,ఏపీ సహకార సంఘాలకు ఐదు ఎకరాలు కొనసాగించాలి అని నిర్ణయించింది.
ఇప్పుడు కొత్తగా ఆరు సంస్థలకి భూకేటాయించారు వాటిలో ఐటీ శాఖకు రెండు ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంక్ కు రెండు ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు 0.4 ఎకరాలు, రాష్ట్ర నిఘా బ్యూరోకు అర ఎకరం, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కి మరో అర ఎకరం, బిజెపి పార్టీకి రెండు ఎకరాల చొప్పున కేటాయించారు.ఇటీవల కేటాయించిన కొన్ని సంస్థలకు భూకేటాయింపు రద్దు చేసారు వాటిలో గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంబికా అగర్ బత్తీకి సంస్థలు ఉన్నాయి.
ఇదివరకు టీడీపీ హయాంలో 130 సంస్థలకు గాను 1270 ఎకరాలు కేటాయించాము అని మంత్రి నారాయణ వెల్లడించారు.గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల ఇందులో కొన్ని సంస్థలు మాత్రమే నిర్మాణం చెప్పటాయి అని ,మిగిలిన సంస్థలు వెన్నకి వెళ్లిపోయాయి అని తెలియచేసారు.ఈ సారి భూమి కేటాయించిన సంస్థలు టైం లైన్ లోపులోనే నిర్మాణం పూర్తి చేయాలి అని ఈ భేటీ లో నిర్ణయించారు.కూటమి ప్రభుత్వం వచ్చాక 64 సంస్థలకు గాను 884 ఎకరాలు భూమిని కేటాయించాము అని తెలియచేసారు.భూములు కేటాయించిన సంస్థలకు నాలుగు నుంచి ఆరు నెలలు సమయం ఇచ్చామని, రాబోయే రెండు మూడు నెలల్లో అన్ని సంస్థలు నిర్మాణాలు చేపడతాయని వెల్లడించారు.ఇదివరకు కేటాయించిన సంస్థలకు నిర్మాణ గడువు ముగిసింది అని వెల్లడించారు.
-
Home
-
Menu