జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటమి అంచున బిఆర్ఎస్ పార్టీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటమి అంచున బిఆర్ఎస్ పార్టీ
X
కార్ బ్రేక్ డౌన్ అయినట్టే అంటున్న అపోజిషన్ పార్టీ లీడర్స్

ఈ ఏడాది డిసెంబర్ లోగ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎప్పుడైనా జరిగే అవకాశం ఉండడంతో ఎవరికీ వారు తమ పార్టీ పట్టు నిలుపుకుపోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు, ప్రజలలో తమ బలం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ కావడంతో మిగిలిన పార్టీలకన్నా బిఆర్ఎస్ కు ఈ విజయం అత్యంత కీలకం కానుంది.జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమయింది. అయితే ఈ ఎన్నికలలో గెలుపు కోసం అధికార, విపక్షాలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు.

అలాగే బిఆర్ఎస్ పార్టీ ఓటమి నుంచి ఈ నాటి వరకు గత ఏడాదిన్నర కాలంగా బిఆర్ఎస్ పార్టీకి అన్ని తానే అయ్యి పార్టీని నడిపిస్తున్న కేటీఆర్ కు కూడా ఈ ఉప ఎన్నిక అగ్ని పరీక్షలా మారింది. ఇన్నాళ్లుగా కేసీఆర్ నాయకత్వ నీడలో ఎదిగిన కేటీఆర్ గత కొద్దీ కాలంగా కేసీఆర్ పార్టీ వ్యవహారాలలో జోక్యం కలగ చేసుకోకుండా ఉండడంతో పార్టీ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు కేటీర్.దీనితో బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్ నాయకుడిగా కేటీఆర్ ప్రస్థానం గాడిన పడాలి అంటే ఈ ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ గెలుపు సాధించాలి. ఇప్పటికే తెలంగాణలో బిఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది అన్నట్టుగా బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారు. ఇక అధికార కాంగ్రెస్ పక్షానికి ఉండే అడ్వాంటేజ్ ఎలాగూ ఉంటుంది.

అయితే గతంలో కూడా ఇదే మాదిరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానంలో ఉపఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ ఎవరు ఊహించని విధంగా మూడో స్థానానికి దిగజారింది. ఆ ఎన్నికలలో కూడా మృతి చెందిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబంలోని ఆమె సొదరికే బిఆర్ఎస్ సీటును కేటాయించినా ఫలితం మాత్రం శూన్యం.

కాబట్టి ఈ ఉప ఎన్నికలు బిఆర్ఎస్ కు, కేటీఆర్ కు జీవన్మరణ సమస్యగా మారనుంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే మరణంతో వచ్చిన ఎన్నికలు కావడంతో ఆయన సతీమణి కే ఆ సీటు దక్కేఅవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కనీసం సానుభూతి అస్త్రం కూడా బిఆర్ఎస్ ను కాపాడలేకపోతే రానున్న భవిష్యత్ కాలంలో బిఆర్ఎస్ రాజకీయంగా అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అసలే బిఆర్ఎస్ ,బీజేపీ లో విలీనం అవుతుంది అని బీజేపీ నాయకులు వదంతిని ప్రచారం చేస్తున్నారు.సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉపఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ విజయం సాధించి ఆత్మవిశ్వాసంలో ఉంది,కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాన్నున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కూడా తమ గెలుపుకాయం అని ప్రచారం చేసుకుంటున్నారు.

Tags

Next Story