మాజీ సీఎం జగన్ పై మరో కొత్త కేసు..105 సెక్షన్ అంటే ఏమిటి?

ఎవరు చేసిన తప్పు వారే అనుభవించాలి అని అనేవారు పెద్దలు,మాజీ ముఖ్యమంత్రి వైస్సార్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విష్యం లో ఇది నిజం అయింది.ఇటీవల సతనపల్లి ,రెంటపాళ్ల దగ్గర విషాద సంఘటనే దీనికి కారణం.అనుమతి లేని ర్యాలీ చేస్తూ సింగయ్య అనే ఒక దళిత వ్యక్తి చావుకి కారణం అయ్యారు జగన్ మరియు వాళ్ళ అనుచరులు.సింగయ్య భార్య లూర్దు మేరి సతేనపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చెప్పాటారు.మొదట జిల్లా పోలీసులు జగన్ కాన్వాయ్ వల్ల సింగయ్య మరణించలేదు అని ధ్రువీకరించిన,వీడియో ఫ్యూటేజ్ ఆదరం సింగయ్య మరణం జగన్ కార్ కింద పడి నలిగి చనిపోయాడు అని నిర్ధానకు వచ్చారు.
వైసీపీ కార్యకర్త అయిన సింగయ్య మరణానికి కారణం అయిన వారిపై పోలీసులు ఎఫ్ ఐ ర్ నమోదుచేశారు,ఇప్పుడు ఎఫ్ ఐ ర్ లో మార్పులుచేశారు సతేనపల్లి పోలీసులు,జగన్ డ్రైవర్ ఆయన రమణారెడ్డి ని A -1,వై ఎస్ జగన్ ను A -2,వ్యక్తిగత కార్యదర్శి కె. నాగేశ్వరరెడ్డిని A3, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని A4, మాజీ మంత్రి పేర్ని నానిని A5, మాజీ మంత్రి విడదల రజినిని A6గా చేర్చారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈ వివరాలను మీడియాకు తెలియచేసారు.
రూల్స్ ప్రకారం జగన్ కాన్వాయ్ తాడేపల్లి నుంచి సతనపల్లి కి కేవలం మూడు కార్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్టు పోలీసులు చెపుతున్నారు,కానీ నిబంధనలకు విరుద్ధంగా చాల కార్లు ప్రయాణించాయని జిల్లా ఎస్పీ తెలిపారు.వీరిపై బీఎన్ఎస్లోని 105, 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు.
బీఎన్ఎస్ 105 సెక్షన్ ని హత్య కిందకు రాని "కల్పబుల్ హోమీసైడ్" అని చర్యలకు ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి మరణానికి కారణమైనప్పుడు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. నేరం నిరూపణ అయితే సంబంధిత వ్యక్తులకు జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది.మరీ ముఖ్యంగా ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కూడా వస్తుంది అన్నారు.
బీఎన్ఎస్ 49 సెక్షన్ కింద వైసీపీ నాయకులు అనుచరులపై కూడా కేసు నమోదు చేసినట్టు చెప్పారు.49 సెక్షన్ అనేది కూడా నేరానికి సాయపడటం లేదా ప్రేరేపించడం వంటి వాటిపై కూడా కఠిన చర్యలు తీసుకోవచ్చు అని వివరించారు.ఇప్పుడు రాష్ట్రం అంతా ఈ సెక్షన్స్ గురించే హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు.ఇప్పుడు ఈ కేసును పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.చూడాలి మరి రాబోయే రోజుల్లో జగన్ అండ్ కో పరిస్థితి ఎలా ఉండబోతుందో.
-
Home
-
Menu