ఏపీలో 31 నామినేటెడ్ పోస్టులు భర్తీ

ఆంధ్రప్రదేశ్లో 31 నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తూ ప్రభుత్వం కొత్త జాబితాను విడుదల చేసింది. ఇందులో బీసీలకు ప్రాధాన్యత కలిపిస్తూ కులాల వారీగా కేటాయింపులు చేసింది, ఓసీకి 6, బీసీకి 17, ఎస్సీకి 4, ఎస్టీకి 1, మైనార్టీలకు 2 పదవులు లభించాయి. ఈ నియామకాలలో ఎక్కువ పదవులు టిడిపి నేతలకు దక్కగా, కొంత భాగం బిజెపి, జెఎస్పి, బహుజన JAC ప్రతినిధులకు కూడా ఇచ్చారు.ఇందులో
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్గా కొడుమూరుకు చెందిన ఆకేపోగు ప్రభాకర్ (టిడిపి) నియమితులయ్యారు. రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డుకు నందిగామకి చెందిన బల కొట్టయ్య (బహుజన JAC) నియమితులయ్యారు. మాంసం అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్గా సింగనమలకి చెందిన ప్రకాశ్ నాయుడు (టిడిపి) బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే బెస్తా కార్పొరేషన్ ఛైర్మన్గా సుల్లూరుపేటకి చెందిన శ్రీధర్ బొమ్మన (టిడిపి) ఎంపికయ్యారు.
బీసీ కోటాలో అనేక కార్పొరేషన్లకు అధ్యక్షులు నియమితులయ్యారు. కమ్మ కార్పొరేషన్కు గురజాలకి చెందిన బ్రహ్మం చౌదరి, బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్కు గుంటూరు వెస్ట్కి చెందిన బుచ్చి రామ్ ప్రసాద్, ముదలియార్ సంక్షేమ కార్పొరేషన్కు చిత్తూరుకు చెందిన సి. ఎస్. త్యాగరాజన్, బొందిలి సంక్షేమ కార్పొరేషన్కు కర్నూలుకు చెందిన డి. విక్రమ్ సింగ్ (అందరూ టిడిపి) ఎంపికయ్యారు. అదనంగా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్కు తిరుపతికి చెందిన దాసరి శ్రీనివాసులు (బిజెపి) నియమితులయ్యారు.
వడ్డీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్గా డెందులూరు నుంచి గుంటసల వెంకట లక్ష్మి (జెఎస్పి), ఆరెకటిక/కటిక/ఆరే-సూర్యవంశీ కార్పొరేషన్కు తాడిపత్రి నుంచి హరికృష్ణరావు హనుమంతకరి (టిడిపి) నియమితులయ్యారు. పాలెగారు మరియు అనుబంధ కులాల సంఘానికి రాయచోటీ నుంచి నాగేశ్వర నాయుడు కందూరి, నూర్బాష/దుదేకుల కార్పొరేషన్కు విజయవాడ వెస్ట్ నుంచి నాగుల్ మీరా కాసునూరి, కురకుల సంఘానికి నరసన్నపేట నుంచి నరసింహులు దామోదర, వికలాంగులు మరియు వృద్ధ పౌరుల కార్పొరేషన్కు రాప్తాడు నుంచి నారాయణ స్వామి (అందరూ టిడిపి) బాధ్యతలు స్వీకరిస్తారు.
అలాగే ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (OUDA) ఛైర్మన్గా షేక్ రియాజ్ (జెఎస్పి) ఎంపికయ్యారు.జానపద కళలు & సృజనాత్మకత అకాడమీ ఛైర్మన్గా పాడేరు నుంచి వంపూరు గంగులయ్య (జెఎస్పి) నియమితులయ్యారు.
తెలుగు మరియు సంస్కృత అకాడమీకి నెల్లూరు సిటీ నుంచి ఆర్. డి. విల్సన్ (బిజెపి), సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీకి రాజమండ్రి సిటీ నుంచి రవి మందలపు (టిడిపి) నియమితులయ్యారు. వీరశైవ లింగాయత, కృష్ణ బాలిజ, జంగం, దాసరి వంటి సంఘాలకు కూడా అధ్యక్షులు నియమించబడ్డారు.
ఈ నియామకాలు ద్వారా ప్రభుత్వం అన్ని వర్గాల వారికి ప్రతినిధ్యాన్ని కల్పించిందని చెబుతోంది. ఎక్కువ భాగం పదవులు టిడిపి నేతలకే దక్కడం గమనార్హం.
-
Home
-
Menu