‘పంచాయిత్’ సీజన్ 4 వచ్చేస్తోంది !

ఓటీటీలో ప్రసారమైన క్రేజీ వెబ్ సిరీస్ లో 'పంచాయిత్' ఒకటి. జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, మరియు మరెందరో ప్రముఖ నటీనటులతో కూడిన ఈ కామెడీ డ్రామా.. ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్రాజెక్ట్గా నిలిచింది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ సిరీస్ నాలుగో సీజన్తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త ఎపిసోడ్లు ఓటీటీలో త్వరలోనే విడుదల కానున్నాయి.
ఈ వెబ్ సిరీస్ను ప్రసారం చేస్తున్న ఓటీటీ సంస్థ, ‘పంచాయిత్ సీజన్ 4’ డిజిటల్ విడుదల గురించి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. కొత్త సీజన్ జులై 2, 2025న అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఎంతోకాలంగా ఈ కొత్త భాగాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్.
ఏప్రిల్ 3న, 'పంచాయిత్' సిరీస్ 5వ వార్షికోత్సవ సందర్భంగా, అధికారిక అనౌన్స్మెంట్ వీడియో విడుదలైంది. 2 నిమిషాలు 29 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో, సచివ్ జీ పాత్రలో మెప్పించిన జితేంద్ర కుమార్, ఈ సారి కూడా కొత్త సీజన్ ప్రేక్షకులను అలరించనున్నట్లు వెల్లడించారు. ఈ వీడియోలో జియా మానేక్ , దర్శన్ మగ్దుమ్, భూపేంద్ర జోగి, విజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. వారు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘పంచాయిత్’ మీమ్స్ గురించి సరదాగా మాట్లాడారు. ఫైసల్ మాలిక్, చందన్ రాయ్, దుర్గేష్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సిరీస్కు దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయ్వర్గీయ దర్శకత్వం వహించగా, ది వైరల్ ఫీవర్ సంస్థ నిర్మించింది.
-
Home
-
Menu