'కన్నప్ప' ఓటీటీ డీల్?

మంచు విష్ణు హీరోగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి భారీ స్టార్స్తో రూపొందిన చిత్రం 'కన్నప్ప'. ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ పౌరాణిక చిత్రం జూన్ 27న థియేటర్లలో విడుదల కాబోతోంది. షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకోసం ప్రచారంలో స్పీడు పెంచింది టీమ్.
హీరో విష్ణు వరుస ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ, సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు. ఇదే కోవలో 'కన్నప్ప' ఓటీటీ డీల్ గురించి చెప్పాడు విష్ణు. భారీ బడ్జెట్ చిత్రాలకి సాధారణంగా విడుదలకుముందే ఓటీటీ ఒప్పందాలు పూర్తి అవుతుంటాయి.
కానీ 'కన్నప్ప'కి ఆఫర్స్ రావడం జరిగినా, తాము అడిగిన రేటు అందలేదు. విష్ణు చెప్పినట్లుగా, 'ఓటీటీ వారు ఒక ఫిగర్ ఇచ్చారు, అది నాకు నచ్చలేదు. హిట్ అయిన తర్వాత మాత్రమే మా రేటుకు అంగీకరించండి, డబ్బులు సిద్ధం చేసుకోండి' అని చెప్పేశానని తెలిపాడు. ఈ మాటలను బట్టి 'కన్నప్ప' విజయంపై విష్ణుకి ఎంత విశ్వాసం ఉందో అనేది తెలుస్తుంది.
-
Home
-
Menu