
ఆసక్తికరంగా ‘విరాటపాలెం‘ ట్రైలర్

అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’. కృష్ణ పోలూరు సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ను రూపొందించారు. జూన్ 27 నుంచి జీ5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. లేటెస్ట్ గా ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’
వహించిన ఈ సినిమా కథ 1980ల నాటి నేపథ్యంతో రూపొందింది. విరాటపాలెం అనే మారుమూల గ్రామంలో పెళ్లిచేసుకున్న ప్రతి వధువు అదే రోజు మరణిస్తుంది. దశాబ్దాలుగా ఒక్క పెళ్లి కూడా జరగని ఆ గ్రామంలో పోలీస్ కానిస్టేబుల్గా మీనా (అభిజ్ఞ వూతలూరు) బదిలీపై వస్తుంది. ఆ శాపం వెనకున్న నిజాన్ని తెలుసుకునే క్రమంలో ఆమె ఎదుర్కొనే అడ్డంకులు, చివరకు తన ప్రాణాన్నే పణంగా పెట్టి ఆ కేసును ఆమె చేధించిందా? అనేదే కథ.
ఇది కేవలం ఒక మిస్టరీయిస్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా, మూఢనమ్మకాలపై బలమైన సందేశాన్ని ఇచ్చే ప్రయత్నంగా ఈ సిరీస్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
-
Home
-
Menu