పెళ్లి రోజే చావు.. 'విరాటపాలెం' రహస్యం?

పెళ్లి రోజే చావు.. విరాటపాలెం రహస్యం?
X
వెబ్ సిరీస్ ‘రెక్కీ’తో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు కృష్ణ పోలూరు, ఇప్పుడు మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’ను తీసుకొస్తున్నాడు.

వెబ్ సిరీస్ ‘రెక్కీ’తో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు కృష్ణ పోలూరు, ఇప్పుడు మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’ను తీసుకొస్తున్నాడు. అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ జూన్ 27 నుంచి ZEE5లో ప్రీమియర్ కానుంది.

ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ 1980ల నాటి 'విరాటపాలెం' అనే మారుమూల గ్రామం నేపథ్యంలో సాగుతుంది. ఆ గ్రామాన్ని ఒక భయంకరమైన శాపం పట్టుకుంటుంది. ప్రతి వధువు తన పెళ్లి రోజున మృతి చెందడమే ఆ శాపం. దాంతో దశాబ్దకాలంగా అక్కడ ఎలాంటి వివాహాలు జరగకపోవడం, ఊరంతా భయాందోళనలో ఉండటం వంటి పరిస్థితులు నెలకొంటాయి.

అలాంటి సమయంలో మీనా అనే లేడీ కానిస్టేబుల్ (అభిజ్ఞ వూతలూరు) ఆ ఊరికి వస్తుంది. ఆమె ఆ గ్రామ శాపం వెనకనున్న రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించటం, ఆ మిస్టరీని ఛేదించడమే ఈ కథలో ప్రధానాంశం. మరి.. వినడానికే ఎంతో థ్రిల్లింగ్ గా ఉన్న ఈ కథ స్క్రీన్ పై ఎలాంటి మజాని అందిస్తుందో తెలుసుకోవాలంటే జూన్ 27 వరకూ ఆగాల్సిందే.

Tags

Next Story