‘భైరవం‘తో బెల్లంకొండ రేంజ్ మారిపోతుందా?

హీరోల కుమారులే కాదు.. నిర్మాతల తనయులు కూడా టాలీవుడ్ లో దుమ్మురేపుతున్నారు. అలాంటి వారిలో వెంకటేష్, అల్లు అర్జున్ తర్వాత చెప్పుకోవాల్సింది బెల్లంకొండ శ్రీనివాస్. తక్కువ సమయంలోనే తెలుగులో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు బెల్లంకొండ. ఆరడుగులకు పైగా హైట్ తో.. ఆన్ స్క్రీన్ పై డాన్స్, ఫైట్స్ లో దుమ్మురేపే శ్రీనివాస్ కు మాస్ హీరో ఇమేజ్ వచ్చింది.
హిందీలో చేసిన ‘ఛత్రపతి‘ రీమేక్ ఆశించిన స్థాయిలో అలరించకపోవడంతో.. ఇప్పుడు తన ఆశలన్నీ ‘భైరవం‘పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో శ్రీనివాస్ పోషించిన పాత్ర ఎంతో రూటెడ్ గా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో అర్థమైంది. యాక్షన్, డ్యాన్స్లలో ఆయన స్పార్క్ కనిపిస్తుంది. అలాగే.. ఈసారి నటనలోనూ మెచ్యూరిటీ స్పష్టంగా కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది.
ముఖ్యంగా ‘భైరవం‘ కోసం బెల్లంకొండ ఎంతగానో కష్టపడినట్టు యూనిట్ చెబుతోంది. ఆయన పాత్ర చిత్రీకరణ, శారీరకంగా తీసుకున్న ట్రాన్స్ఫర్మేషన్.. ఇవన్నీ ఈ సినిమాలో హైలైట్స్గా నిలవనున్నాయని తెలుస్తోంది. సెన్సార్ రిపోర్ట్ కూడా సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని పెంచుతుంది. ఇలా ‘భైరవం‘తో బెల్లంకొండ రేంజ్ మారుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి.
మరోవైపు ‘భైరవం‘ తర్వాత బెల్లంకొండ లైనప్ కూడా క్రేజీగానే ఉంది. ‘కిష్కిందపురి, టైసన్ నాయుడు, హైందవ‘ వంటి వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. మొత్తంగా.. మే 30న రాబోతున్న ‘భైరవం‘ బెల్లంకొండ శ్రీనివాస్ కు మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలుస్తుందేమో చూడాలి.
-
Home
-
Menu