వేదం చిత్రానికి 15 ఏళ్ళు.. బన్నీ ట్వీట్!

వేదం చిత్రానికి 15 ఏళ్ళు.. బన్నీ ట్వీట్!తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రం వేదం. 2010లో విడుదలైన ఈ సినిమాను దర్శకుడు క్రిష్ ఎంతో వినూత్నంగా తెరకెక్కించాడు. వేదం సినిమా కథ, నటీనటుల ప్రదర్శన ప్రతిదీ అప్పటికి ఎంతో విభిన్నంగా ఆకట్టుకున్నాయి.
తెలుగు చిత్రసీమలో తక్కువగా చూసే అంథాలజీ ఫార్మాట్ తో వేదం వచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా కేబుల్ రాజు పాత్రలో అల్లు అర్జున్, వేశ్య గా అనుష్క పాత్రలకు మంచి పేరొచ్చింది.
వేదం సినిమా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. ''వేదం సినిమా 15 ఏళ్ళ ప్రయాణం. నా కెరీర్లో ఓ విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రంగా నిలిచింది. ఇలాంటి నిజాయితీతో కూడిన కథను తెరకెక్కించిన డైరెక్టర్ క్రిష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అనుష్క, మనోజ్, మనోజ్ బాజ్పాయి మిగతా అద్భుత నటీనటులతో కలిసి పనిచేయడం ఒక ప్రత్యేక అనుభవం. ఈ యాత్రలో భాగమవటం నిజంగా ఎంతో ప్రత్యేకం.
కీరవాణి గారు అందించిన సంగీతానికి, నిర్మాతలు శోభు గారు, ప్రసాద్ దేవినేని గారు తమ ధైర్యవంతమైన విజన్తో ఈ చిత్రాన్ని నమ్మి ముందుకు తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు. వేదం చిత్రాన్ని గుండెల్లో పెట్టుకున్న ప్రతి అభిమానికి మేము ఎప్పటికీ ఋణపడి ఉంటాం. మీరు ఈ సినిమాను కాలాతీతంగా మార్చారు.' అని తన పోస్ట్ లో తెలిపాడు.
-
Home
-
Menu