విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చేశాడు !

విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చేశాడు !
X
‘బెగ్గర్’ అనే టైటిల్, పోస్టర్ అంతా ఫేక్. అది పూరి జగన్నాథ్ సినిమాకి సంబంధించినది కాదు. అవి అభిమానులు ఏఐ సహాయంతో తయారుచేసినవి. అది నిజమైన టైటిల్ కాదు, అధికారిక పోస్టర్ కాదు” అని స్పష్టంగా చెప్పాడు.

తమిళ వెర్సటైల్ స్టార్ విజయ్ సేతుపతి, టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖ నటి టబు కూడా కీలక పాత్రలో నటించనుండగా, మల్లూ బ్యూటీ నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది.

తన తాజా తమిళ చిత్రం “ఏస్” ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన విజయ్ సేతుపతి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టైటిల్ పోస్టర్‌పై క్లారిటీ ఇచ్చాడు. ‘బెగ్గర్’ అనే టైటిల్, పోస్టర్ అంతా ఫేక్. అది పూరి జగన్నాథ్ సినిమాకి సంబంధించినది కాదు. అవి అభిమానులు ఏఐ సహాయంతో తయారుచేసినవి. అది నిజమైన టైటిల్ కాదు, అధికారిక పోస్టర్ కాదు” అని స్పష్టంగా చెప్పాడు.

ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌తో కలిసి పనిచేసే అవకాశంపై తన ఆనందాన్ని కూడా పంచుకున్నాడు విజయ్ సేతుపతి. “పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ చెప్పిన విధానం నాకు ఎంతో నచ్చింది. మొదట రెండు రోజుల్లో స్క్రిప్ట్ వినాలని అనుకున్నా. కానీ ఆయన చెప్పే విధానం నన్ను బాగా ఆకట్టుకోవడంతో పూర్తిగా ఓకే సిట్టింగ్‌లోనే మొత్తం కథను విన్నాను,” అని చెప్పాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, చార్మ్మీ కౌర్ కలిసి నిర్మించనుండగా, షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Tags

Next Story