
ఈ ఇద్దరి సినిమాల లాంచింగ్ దసరాకే!

ఈ ఏడాది దసరా పండగ సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు సూపర్ భారీ బడ్జెట్ సినిమాలు గ్రాండ్గా లాంచ్ కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలూ అభిమానుల్లో మాంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇవి ఇద్దరు టాప్ స్టార్స్తో, టాలెంటెడ్ డైరెక్టర్లతో రూపొందుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. గతంలో 'వాల్తేరు వీరయ్య' సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి ఆయనతో కలిసి పనిచేయబోతున్నాడు. ఈ కొత్త సినిమా ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందని టాక్. 'వాల్తేరు వీరయ్య'లో చిరు యాక్షన్, స్వాగ్, ఎమోషన్స్ అన్నీ కలగలిపి ఫ్యాన్స్కి ఫుల్ ఖుషీ ఇచ్చిన బాబీ.. ఈసారి కూడా అదే జోష్తో భారీ స్కేల్లో సినిమాని ప్లాన్ చేస్తున్నారట.
ఈ ప్రాజెక్ట్ని కేవీయన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై గ్రాండ్గా నిర్మించనున్నారు. అక్టోబర్ 2న, అంటే దసరా సందర్భంగా, ఈ సినిమా లాంచ్ ఈవెంట్ సూపర్ జోష్తో జరగబోతోంది. షూటింగ్ విషయానికొస్తే, చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ వర్క్ పూర్తయిన వెంటనే, నవంబర్ నుంచి ఈ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.
మరోవైపు, నందమూరి బాలకృష్ణ కూడా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో రీయూనైట్ అవుతున్నారు. వీళ్లిద్దరూ గతంలో 'వీరసింహా రెడ్డి' సినిమాతో మాస్ ఆడియన్స్ని ఊపేశారు. ఆ సినిమాలో బాలయ్య డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ ఫ్యాన్స్కి ఫుల్ జోష్ ఇచ్చాయి. ఇప్పుడు ఈ కాంబో మరోసారి అదే ఎనర్జీతో, అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్తో రాబోతోంది.
ఈ ప్రాజెక్ట్ని 'పెద్ది' ఫేమ్ వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా దసరా రోజున, అంటే అక్టోబర్ 2న, గ్రాండ్ లాంచ్ ఈవెంట్తో మొదలవనుంది. షూటింగ్ అక్టోబర్లోనే స్టార్ట్ అవుతుంది. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ సినిమా రిలీజ్ కానుంది. గోపీచంద్ మలినేని మార్క్ మాస్ ఎలిమెంట్స్తో ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వెయిట్ చేసి చూడాలి.
-
Home
-
Menu