కొత్త సినిమాకి సైన్ చేసిన మెగా మేనల్లుడు

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ .. ప్రస్తుతం 'సంబరాల ఏటి గట్టు' సినిమాపైనే దృష్టి పెట్టాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా గత ఏడాది నుంచి నిర్మాణంలో ఉంది. అయితే, ఈ సినిమా విడుదల వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇక సాయి ధరమ్ తేజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి పెద్దగా అప్డేట్స్ లేవు. ఇప్పుడు, ఈ మెగా హీరో తాజాగా ఒక కొత్త ప్రాజెక్ట్ను సైన్ చేశాడని సమాచారం.
ఇది త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. టాలెంటెడ్ రైటర్ అండ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమా కోసం ఒక స్క్రిప్ట్ రాశాడట. అది సాయి ధరమ్ తేజ్ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాను రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వర రావు' దర్శకుడు వంశీ కృష్ణ డైరెక్ట్ చేయనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలే ఇది ఖరారైంది. ప్రస్తుతం మారుతి.. ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' సినిమా దర్శకత్వంలో బిజీగా ఉన్నాడు. కాబట్టి అతడికి సాయి ధరమ్ తేజ్ సినిమాను డైరెక్ట్ చేయడానికి సమయం లేదు. అందుకే ఈ ప్రాజెక్ట్ను వంశీ కృష్ణకు అప్పగించారు.
-
Home
-
Menu