ఈ వార్తలు నిజమేనా?

తాజాగా తెలుగు హీరోయిన్ రీతూ వర్మ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దుబాయ్లోని బూర్జ్ ఖలీఫా బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక ఫోటోలో ఆమె యువ హీరో వైష్ణవ్ తేజ్తో కలిసి కనిపించడం గ్యాసిప్ ప్రపంచంలో కొత్త ఊహాగానాలకు దారితీసింది. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ కావడంతో వీరిద్దరూ కలిసి రొమాంటిక్ గెట్టుగెదర్కు వెళ్లినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే, ఈ విషయంపై రితు వర్మ గానీ, వైష్ణవ్ తేజ్ గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇద్దరూ ఈ సంబంధంపై నోరు విప్పకుండా మౌనమే పాటిస్తున్నారు. ప్రేమలో ఉన్నారా? కాదా? అనే సందేహాలను వాళ్లు మరింతగా పెంచుతున్నారు. వైష్ణవ్ తేజ్ విషయానికి వస్తే, అతను 'ఉప్పెన' చిత్రంతో అద్భుతమైన ఎంట్రీ ఇచ్చినా, ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటూ ఉన్నాడు. ప్రస్తుతానికి అతని తదుపరి సినిమా ప్రకటన ఇంకా వెలువడలేదు.
అలాగే రితూ వర్మ మాత్రం వృత్తిపరంగా ముందుకు సాగుతోంది. త్వరలో జియో హాట్స్టార్లో విడుదలకానున్న తన తాజా వెబ్సిరీస్ “దేవిక అండ్ డ్యానీ” ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్ల సందర్భంగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు తట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ విషయంలో నిజానిజాలేంటో తెలియాలి.
-
Home
-
Menu