బ్రాండ్ అంబాసిడర్ గా గ్లోబల్ స్టార్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్తో భాగస్వామిగా మారాడు. రిలయన్స్కి చెందిన ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ ‘కాంపా’ కు అతడు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యాడు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికారికంగా ఓ ప్రకటన ద్వారా ప్రకటించింది. 2023 మార్చిలో మార్కెట్లోకి అడుగుపెట్టిన కాంపా... భారత్లోని పోటీభరిత బీవరేజ్ రంగంలో వేగంగా ఎదుగుతోంది.
ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్న రామ్ చరణ్తో రిలయన్స్ కలయిక, బ్రాండ్కు మరో కీలక మైలురాయిగా మారిందని భావిస్తున్నారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా “కాంపా వాలి జిద్ద్” అనే థీమ్తో రామ్ చరణ్ పై ప్రత్యేకంగా రూపొందించిన యాడ్ ఒకటి విడుదలైంది. ఈ ప్రచార కార్యక్రమం ఐపీఎల్, డిజిటల్ మీడియా, టెలివిజన్ చానెళ్లు, మొబైల్ ప్లాట్ఫారములు వంటి అనేక వేదికలపై ప్రసారం చేయబోతున్నారు.
ఈ కొత్త ప్రచారంతో కాంపా మార్కెట్లో తన స్థానం మరింత బలోపేతం చేసుకుంటుందని అంచనా. రామ్ చరణ్ ఆకర్షణతో యువతను టార్గెట్ చేస్తూ బ్రాండ్ మరింత ప్రజాదరణ పొందే అవకాశాలున్నాయి.
-
Home
-
Menu