ఆలీని తిట్టి మళ్ళీ వివాదంలో చిక్కుకున్నాడు !

వెటరన్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి తన అనుచితమైన భాష వల్ల వివాదంలో చిక్కుకున్నారు. ఎప్పటిలాగే తన బహిరంగ వేదికలపై సంయమనం లేని మాటలతో ప్రసిద్ధి చెందిన ఈ నటుడు, ఇటీవలి పబ్లిక్ ఈవెంట్స్లో తన వ్యాఖ్యల కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
తాజాగా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో, రాజేంద్ర ప్రసాద్ తన సన్నిహిత సహచరుడు, కమెడియన్ అలీని సమీపంలోకి రమ్మని పిలుస్తూ అసభ్యకరమైన పదజాలం వాడారు. ఆయన ఇలా అన్నారు.. “అరె అలీ గా.. అంటూ ఒక లకారంతో వచ్చే తిట్టును వాడారు.
ఈ షాకింగ్ కామెంట్కు అలీ నవ్వుతూ స్పందించి, ఆ క్షణాన్ని తేలిగ్గా తీసుకున్నట్లు కనిపించాడు. స్నేహితుల మధ్య ప్రైవేట్ సంభాషణల్లో ఇలాంటి భాష సాధారణమైనా, పబ్లిక్ వేదికపై దీన్ని వాడటం ఈవెంట్లో ఉన్న చాలామందిని, చూసిన వీక్షకులను కలవరపెట్టింది. ఈ వేడుకలో నటీమణులు లయ, ఆమని, ఇంద్రజ వంటి మహిళలతో పాటు శ్రీకాంత్, మురళీ మోహన్ వంటి సహచర నటులు కూడా హాజరయ్యారు.
ఇటీవలి కొన్ని ఈవెంట్స్లో రాజేంద్ర ప్రసాద్ మద్యం సేవించి హాజరైనట్లు కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి, అయితే ఇవి ధృవీకరించబడలేదు. కొందరు ఆయన ప్రవర్తనను వయసు మీద పడటంతో వచ్చే మార్పులకు ఆపాదిస్తుండగా, మరికొందరు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, బహిరంగ జీవితంలో కనీస సంయమనం, సభ్యత పాటించాలని కోరుతున్నారు.
-
Home
-
Menu