సెన్సేషనల్ కాంబో సెట్ అయిందా?

సెన్సేషనల్ కాంబో సెట్ అయిందా?
X
వివేక్ ఆత్రేయ త్వరలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయబోతున్నారని టాక్. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

వివేక్ ఆత్రేయ... ఈ పేరు వినగానే మనకెదురయ్యే ఫీలింగ్ ‘స్మార్ట్ ఎంటర్టైనర్’. తనదైన శైలి, హాస్యంతో మేళవించిన కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ కొత్తతరానికి చెందిన దర్శకుడు.. తాజాగా నేచురల్ స్టార్ నానీ హీరోగా ‘సరిపోదా శనివారం’ సినిమాతో మాస్ ఆడియన్స్‌ను కూడా మెప్పించగల సామర్థ్యం ఉందని నిరూపించుకున్నాడు.

ఇప్పుడు ఆయన తదుపరి సినిమా గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు అభిమానుల్లో సంచలనం రేపుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. వివేక్ ఆత్రేయ త్వరలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయబోతున్నారని టాక్. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యానర్ ఇటీవల తమిళ నటుడు అజిత్‌తో చేసిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా భారీ హిట్ కావడంతో ఇతర భాషలవైపూ దృష్టి పెడుతోంది.

వివేక్ ఆత్రేయ ఇప్పటికే రజనీతో ప్రాథమిక చర్చలు మొదలుపెట్టినట్టు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ సంచలన కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఆయన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా కూలీ ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. మరి వివేక్ ఆత్రేయ అండ్ రజనీకాంత్ కలయికలో తెరకెక్కబోయే ఈ సినిమా ఏ రేంజ్ ఉంటుందో చూడాలి.

Tags

Next Story