పూరీ - విజయేంద్ర ప్రసాద్ కాంబో నిజమేనా?

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సీనియర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల హైదరాబాద్లో కలిశారు. ఈ సమావేశం వారిద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తారేమో అనే ఊహాగానాలకు తెరలేపింది. పూరి టీమ్ సోషల్ మీడియాలో ఈ కలయిక ఫోటోలను షేర్ చేస్తూ, విజయేంద్ర ప్రసాద్ జ్ఞానం, స్పష్టమైన ఆలోచనలు నిజంగా స్ఫూర్తిదాయకమని క్యాప్షన్లో పొగిడారు.
ఇప్పటివరకూ వారిద్దరూ కొలాబరేట్ అవడం గురించి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ మీటింగ్ ఫ్యాన్స్లోనూ, నెటిజన్స్లోనూ హైప్ క్రియేట్ చేసింది. ఈ ఇద్దరు క్రియేటివ్ బ్రెయిన్స్ ఓ సినిమా కోసం జతకడతారేమో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన తదుపరి సినిమాకి సిద్ధమవుతున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి, టబు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని చార్మీ కౌర్ నిర్మిస్తోంది.
విజయేంద్ర ప్రసాద్, “బాహుబలి”, “ఆర్ఆర్ఆర్” వంటి బ్లాక్బస్టర్ల రచయితగా పేరు తెచ్చుకున్నారు. గతంలో ఆయన పూరి జగన్నాథ్ పనిని పొగుడుతూ, అతడి టాలెంట్కి ఈర్ష్య పడతానని, కలిసి పనిచేయాలని ఉందని ఇంటర్వ్యూలలో చెప్పారు. పూరి టీమ్ ఇలా రాసింది.. “కొన్ని క్షణాలు మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి... లెజెండరీ రైటర్ విజయేంద్రప్రసాద్ గారితో సమయం గడపడం అలాంటి అనుభవమే. ఆయన వినయం, జ్ఞానం, స్పష్టమైన ఆలోచనలు నిజంగా స్ఫూర్తినిస్తాయి.”
విజయేంద్ర ప్రసాద్ తన కొడుకు, డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళితో పాటు ఇతర టాప్ ఫిల్మ్మేకర్స్తో తరచూ పనిచేస్తుంటారు. కానీ పూరితో ఇంతవరకూ జతకట్టలేదు. ఒకవేళ ఈ మీటింగ్ ఓ కొత్త ప్రాజెక్ట్కి దారితీస్తే, తెలుగు తెరపై ఇదొక బిగ్ క్రియేటివ్ కాంబో అవుతుంది.
-
Home
-
Menu