రామోజీ ఫిల్మ్ సిటీలో యన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీ చుట్టూ హైప్ రోజు రోజుకూ ఊపందుకుంటోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్.. మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మాణం జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్గా తాజా షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించింది.
సినిమా టీమ్ ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణలో నిమగ్నమై ఉంది. ఈ ప్రాజెక్ట్ స్కేల్, దాని స్టార్ పవర్తో సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ పై దాదాపు 2000 జూనియర్ ఆర్టిస్టులతో కలిసి కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరిస్తున్నారు. ఇది పీరియడ్ డ్రామా ఎలిమెంట్స్తో పాటు ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ యాక్షన్ను కలగలిపిన ఒక భారీ కథాంశంగా తెరకెక్కనుంది.
ఈ సినిమాలో రుక్మిణి వసంత్ ఎన్టీఆర్కు జోడీగా నటిస్తున్నారు, ఇది ఆమె కెరీర్లో ఒక ముఖ్యమైన అవకాశంగా చెప్పవచ్చు. ప్రశాంత్ నీల్ గత చిత్రాలలో చూపించిన గ్రాండ్ విజువల్స్ మరియు ఎమోషనల్ డెప్త్ ఈ సినిమాలోనూ కనిపించనున్నాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమా 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందని, అలాగే ప్రశాంత్ నీల్ బ్రాండ్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లనుందని అందరి నమ్మకం.
-
Home
-
Menu