నయనతారతో చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి !

నయనతారతో చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి !
X
నిర్మాతల ఒత్తిడితో చివరికి నయనతార తన పారితోషికాన్ని కొంత తగ్గించి, ఒక అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం నిర్మాతలతో ఆమె ఒప్పందం పూర్తయ్యే దశలో ఉంది.

టాలీవుడ్‌లో ఇప్పటికీ భారీ పారితోషికాన్ని తీసుకుంటూ, పలు మెగా ప్రాజెక్ట్స్‌లో చోటు దక్కించుకుంటున్న నయనతార మరోసారి వార్తల్లోకి వచ్చింది. యశ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం “టాక్సిక్” లో కీలక పాత్ర దక్కించుకున్న నయనతార... ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఓ పెద్ద ప్రాజెక్ట్‌కు సైన్ చేయబోతోంది.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో రెండు సినిమాల్లో నటించిన నయనతార.. ఇప్పుడు మళ్లీ ఆయన సరసన నటించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. నెల క్రితం నయనతారను ప్రధాన హీరోయిన్‌గా తీసుకోవాలని అనిల్ ఆమెను సంప్రదించారు. అయితే ఆమె డిమాండ్ చేసిన పారితోషికం దర్శకుడిని ఆశ్చర్యపరిచింది.

అయితే నిర్మాతల ఒత్తిడితో చివరికి నయనతార తన పారితోషికాన్ని కొంత తగ్గించి, ఒక అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం నిర్మాతలతో ఆమె ఒప్పందం పూర్తయ్యే దశలో ఉంది. అధికారికంగా ఆమోదం లభించిన వెంటనే నయనతార పేరును అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాలో నయనతార ప్రధాన కథానాయికగా కనిపించనుండగా... కేథరిన్ ట్రెసా రెండో కథానాయిక గా ఫిక్సయినట్టు టాక్.

గతంలో “సైరా”లో చిరంజీవి భార్యగా, “గాడ్‌ఫాదర్”లో చిరంజీవి చెల్లెలిగా నటించిన నయనతార... ఇప్పుడు పూర్తిస్థాయి కథానాయికగా మళ్లీ చిరుతో జత కట్టనుండటం విశేషం. ప్రస్తుతం ‘చిరు అనిల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుచుకుంటున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం సంక్రాంతి 2026 రిలీజ్‌కి రిలీజ్ కాబోతోంది.

Tags

Next Story