‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ వేంచేస్తున్నారహో !

‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ వేంచేస్తున్నారహో !
X
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 6న థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు.

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో నార్నే నితిన్ వరుసగా మూడు హిట్లు కొట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. 'మ్యాడ్', 'ఆయ్', 'మ్యాడ్ స్క్వేర్' సినిమాల విజయంతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నితిన్, ఇటీవల శ్రీ విష్ణు నటించిన సూపర్ హిట్ చిత్రం 'సింగిల్'లో స్పెషల్ క్యామియోలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే... నార్నే నితిన్ నటించిన తొలి చిత్రం 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' అనే యువతరానికి నచ్చే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చాలా కాలంగా విడుదల కాకుండా ఉండిపోయింది.

అనేక కారణాలతో ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మళ్ళీ ఊపందుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 6న థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన జాతీయ అవార్డు గెలుచుకున్న 'శతమానం భవతి' చిత్రంతో ఆయన పేరు మరింతగా మారుమోగిపోయింది.

'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' కథను నార్నే నితిన్ బావ అయిన ఎన్టీఆర్‌కు వినిపించగా, కథ నచ్చడంతో ఆయన ఆమోదముద్ర వేయడంతో షూటింగ్ ప్రారంభమై పూర్తయింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సమ్హిత నటించింది. శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్‌పై చింతపల్లి రామారావు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో నరేశ్, రావు రమేష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం కైలాష్ మీనన్ అందించారు. మలయాళ చిత్రం ‘తీవండి’ (పొగబండి) కి ఇది అఫీషియల్ రీమేక్. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ సినిమా మాలీవుడ్ లో సూపర్ హిట్టయింది.

Tags

Next Story