‘కన్నప్ప’ జన్మస్థలాన్ని సందర్శించిన మంచు విష్ణు !

‘కన్నప్ప’ జన్మస్థలాన్ని సందర్శించిన మంచు విష్ణు !
X
విష్ణు మంచు ‘కన్నప్ప’ జన్మస్థలాన్ని సందర్శించారు. ఆయన అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలంలోని ఊటుకూరు గ్రామానికి వెళ్లి అక్కడి గ్రామస్థులు, దేవాలయ అధికారుల నుండి ఘన స్వాగతం పొందారు.

డైనమిక్ స్టార్ విష్ణు మంచు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈ సంవత్సరం ఏప్రిల్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. మోహన్ బాబు నిర్మాణంలో, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు, పాటలతో మంచి హైప్‌ను క్రియేట్ చేసింది.

ఇంతకు ముందు విష్ణు మంచు.. ఈ సినిమాకు సంబంధించి తన భక్తిని వ్యక్తం చేస్తూ సినిమా విడుదలకు ముందుగా 12 జ్యోతిర్లింగాలను సందర్శిస్తానని వెల్లడించారు. ఇప్పుడు ఆయన తన ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. అంతేగాక, విష్ణు మంచు ‘కన్నప్ప’ జన్మస్థలాన్ని సందర్శించారు. ఆయన అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలంలోని ఊటుకూరు గ్రామానికి వెళ్లి అక్కడి గ్రామస్థులు, దేవాలయ అధికారుల నుండి ఘన స్వాగతం పొందారు. గ్రామ ప్రజలు, దేవస్థానం అధికారులు ‘కన్నప్ప’ టీమ్‌ను ఉత్సాహంగా ఆహ్వానించారు.

అక్కడ ఆయన కన్నప్ప నివసించిన స్థలమైన శివాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంకా, ఆ ఆలయ అభివృద్ధికి తన వంతుగా సహాయపడతానని వాగ్దానం చేశారు. ‘కన్నప్ప’ సినిమాలో మోహన్ బాబు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన అందుకుంటున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా బహుభాషల్లో విడుదల కాబోతోంది.

Tags

Next Story