విశాఖలో స్టూడియో అవసరమా? అనవసరమా?

విశాఖలో స్టూడియో అవసరమా? అనవసరమా?
X

విశాఖపట్నంలోని సముద్రతీర ప్రాంతంలో రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూముల వినియోగంపై మరోసారి వివాదం రేగింది. 2010లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ద్వారా సురేష్ ప్రొడక్షన్స్‌కి 34.44 ఎకరాల విలువైన భూమిని కేవలం రూ. 1.79 కోట్లకే కేటాయించారు. కానీ పదేళ్లకు పైగా గడిచినా, ఆ స్థలంలో పరిపూర్ణంగా స్టూడియో అభివృద్ధి జరగకపోవడం వల్లే ప్రభుత్వం ఇప్పుడు ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని యోచిస్తోంది.వాస్తవానికి, సముద్రతీరంలో ఉన్న ఈ భూముల నిర్వహణ సవాలుగా మారిందని, అలాగే సినిమా కార్యకలాపాలు ప్రధానంగా హైదరాబాద్‌కే పరిమితమవుతున్న నేపథ్యంలో విశాఖలో స్టూడియో అవసరం తక్కువగా ఉందన్న వాదనలు వెలువడుతున్నాయి.



జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో, ఖాళీగా ఉన్న 15 ఎకరాలను వాణిజ్యాభివృద్ధికి అనుకూలంగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే, ఈ నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఫలితంగా ఆ ప్రపోజల్ అమలులోకి రాలేదు. మొత్తంగా చట్టపరమైన సమస్యలు, రాజకీయ వ్యతిరేకతలు కొనసాగేలా కనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఆ భూమిని తిరిగి తీసుకునే ప్రక్రియ ప్రారంభించినట్టు తెలుస్తోంది.





Tags

Next Story