నెక్స్ట్ మూవీ ప్రిపరేషన్ లో డైరెక్టర్ క్రిష్

తన గ్రిప్పింగ్ స్టోరీటెల్లింగ్, యూనిక్ విజన్తో ఆడియన్స్ని ఎప్పుడూ ఆకట్టుకునే ఫిల్మ్మేకర్ క్రిష్ జాగర్లమూడి. ప్రస్తుతం అనుష్క శెట్టి మెయిన్ లీడ్ లో ఘాటీ మూవీని విడుదలకు రెడీ చేసిన అతడు.. తదుపరిగా.. నందమూరి బాలకృష్ణ ఐకానిక్ కల్ట్ క్లాసిక్ 'ఆదిత్య 369'కి సీక్వెల్గా రూపొందనున్న 'ఆదిత్య 999'ని డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ వార్త టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారడమే కాక, సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ మధ్య భారీ బజ్ క్రియేట్ చేస్తోంది.
లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం.. ఈ సినిమా కోసం స్వయంగా బాలకృష్ణ రాసిన స్క్రిప్ట్తో క్రిష్ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడని తెలుస్తోంది. బాలయ్య లాంటి మాస్ హీరో, క్రిష్ లాంటి క్రాఫ్టీ డైరెక్టర్ కాంబో అంటే.. ఇది ఖచ్చితంగా ఒక గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అవుతుందని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చరిత్ర, సైన్స్ ఫిక్షన్, ఎమోషనల్ డ్రామా ఎలిమెంట్స్ని కలగలిపి, ఆడియన్స్కి ఒక రోలర్కోస్టర్ రైడ్ లాంటి ఫీల్ ఇవ్వబోతోందని అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక ఈ సినిమాకి మరో స్పెషల్ హైలైట్ ఏంటంటే... బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఈ చిత్రంతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే న్యూస్. ఈ విషయం ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ కాకపోయినా.. సోషల్ మీడియాలో ఈ టాక్ వైరల్గా మారి, నందమూరి ఫ్యాన్స్ని ఫుల్ ఎక్సైట్మెంట్లో ముంచెత్తింది. మోక్షజ్ఞ డెబ్యూ, బాలయ్య స్క్రిప్ట్, క్రిష్ డైరెక్షన్ కాంబినేషన్తో 'ఆదిత్య 999' ఒక బిగ్ బడ్జెట్ విజువల్ ట్రీట్గా రాబోతోందని ట్రేడ్ సర్కిల్స్లోనూ డిస్కషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ఒరిజినల్ 'ఆదిత్య 369' సినిమా తెలుగు సినిమా హిస్టరీలో ఒక ల్యాండ్మార్క్ ఫిల్మ్గా నిలిచిన నేపథ్యంలో, దానికి సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రం మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. క్రిష్ లాంటి డైరెక్టర్, బాలయ్య లాంటి స్టార్, మోక్షజ్ఞ లాంటి న్యూ టాలెంట్ కలిసి ఈ ప్రాజెక్ట్ని ఎలా షేప్ చేస్తారో చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
-
Home
-
Menu