‘వీరమల్లు’ చిత్రానికి అదే హైలైట్ !

‘వీరమల్లు’ చిత్రానికి అదే హైలైట్ !
X
క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను ఇరాక్‌లో ఆరు వారాల పాటు చిత్రీకరించారు. ఈ భారీ యాక్షన్ భాగం కోసం నిర్మాతలు వెరిగిన బడ్జెట్ వెచ్చించినట్టు సమాచారం. ఈ భాగమే చిత్రానికి హైలైట్‌గా నిలవనుందని టాక్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం "హరిహర వీర మల్లు: పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్" ప్రపంచవ్యాప్తంగా జూన్ 12, 2025న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం తదితర భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. మరో ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

ఇంక ఈ చిత్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను ఇరాక్‌లో ఆరు వారాల పాటు చిత్రీకరించారు. ఈ భారీ యాక్షన్ భాగం కోసం నిర్మాతలు వెరిగిన బడ్జెట్ వెచ్చించినట్టు సమాచారం. ఈ భాగమే చిత్రానికి హైలైట్‌గా నిలవనుందని టాక్.

ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు కృష్ణ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కించారు. నిర్మాతగా ఏ. దయాకర్ రావు వ్యవహరిస్తున్నారు. సంగీతాన్ని ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా యాక్షన్ మరియు పీరియాడిక్ సినిమాలను ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులందరికీ ఈ చిత్రం విజువల్ స్పెక్టాకిల్ గా నిలిచే అవకాశం ఉంది.

Tags

Next Story