మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ !

ప్రస్తుతం తెలుగు సంగీత రంగాన్ని శాసిస్తున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అని చెప్పుకోవాలి. ఇటీవల ఆయన రూపొందించిన పాటలన్నీ విపరీతంగా హిట్ అవుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాలోని పాటలన్నీ ఘన విజయం సాధించి, భీమ్స్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ ఘన విజయం తర్వాత, భీమ్స్ తన రెమ్యునరేషన్ను భారీగా పెంచినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
ఆయన డిమాండ్ చేస్తున్న పారితోషికం ఇప్పటికే ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ కంటే ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం ప్రస్తుతం పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం భీమ్స్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిరు- అనిల్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇదొక భారీ బడ్జెట్ ప్రాజెక్టు. దీనితో పాటు “మాస్ జాతర”, “డకాయిట్” వంటి సినిమాలకు కూడా ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
“సంక్రాంతికి వస్తున్నాం” సినిమాలోని పాటలతో పాటు “మ్యాడ్ ” సినిమాకు ఇచ్చిన సంగీతం బ్లాక్బస్టర్గా నిలిచిన నేపథ్యంలో, అనేక నిర్మాతలు భీమ్స్తో పని చేయాలనే ఆసక్తి చూపుతున్నారు. ఆయన పాటలకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉండటంతో, భీమ్స్ ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచాడు.
అయితే, మరోవైపు ఆయన డిమాండ్ చేస్తున్న పారితోషికం కొంతమంది నిర్మాతలకు తట్టులేకపోతున్నారు. తక్కువ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు ఈ రేట్లకు భీమ్స్ను ఎంచుకోవడం కష్టమేనంటున్నారు. “ఇంకొంచెం తక్కువ రేటుకు పని చేస్తే, ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు వస్తాయి” అన్నదే వారి అభిప్రాయం. ఏదేమైనా, భీమ్స్ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నది మాత్రం అక్షరాలా నిజం!
-
Home
-
Menu