కొత్త ప్రాజెక్టులతో వేగం పెంచుతున్న అఖిల్‌

కొత్త ప్రాజెక్టులతో వేగం పెంచుతున్న అఖిల్‌
X
‘సామజవరగమన’ చిత్ర సహ రచయిత నందు కథ అందించగా.. అతడి దర్వకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి అఖిల్‌ ఓకే చెప్పినట్లు సమాచారం.

టాలీవుడ్‌ యంగ్ హీరో అక్కినేని అఖిల్‌ తన సినిమాల స్పీడ్‌ను పెంచుతున్నాడు. ప్రస్తుతం అతడు ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్‌ మురళీ కిశోర్‌ అబ్బూరుతో ఓ సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా... అఖిల్‌ సహా ప్రధాన తారాగణంపై యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఓ పాటను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు ‘లెనిన్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది.

ఇదిలా ఉంటే.. అఖిల్‌ త్వరలోనే యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై కొత్త దర్శకుడు అనిల్‌ దర్శకత్వంలో ఓ భారీ పీరియాడిక్‌ చిత్రం చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌కు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కొత్త చిత్రానికి ‘సామజవరగమన’ చిత్ర సహ రచయిత నందు కథ అందించగా.. అతడి దర్వకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి అఖిల్‌ ఓకే చెప్పినట్లు సమాచారం.

పూర్తిగా వినోదాత్మకంగా ఉండనున్న ఈ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్‌ను శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారని సమాచారం. మొత్తంగా చూస్తే, వరుస సినిమాలతో అఖిల్‌ తన కెరీర్‌కి కొత్త జోష్‌ తెచ్చుకుంటున్నాడు!

Tags

Next Story