సోషల్ మీడియాలో యాక్టివిటీ తగ్గించాడు !

అఖిల్ అక్కినేని తన లైఫ్లో ఇప్పుడు ఫ్రెష్ ఫేజ్లోకి అడుగు పెట్టాడు. జూన్ 6, 2025న, తన లాంగ్టైమ్ గర్ల్ఫ్రెండ్ జైనబ్ తో హైదరాబాద్లో సింపుల్ అండ్ సైలెంట్గా వెడ్డింగ్ జరుపుకున్నాడు. కానీ, రెండు రోజుల తర్వాత జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం టోటల్ గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్కి పొలిటీషియన్స్, సినీ సెలెబ్స్, ఇండస్ట్రీ బిగ్షాట్స్ హాజరై ఈ జంటకు విషెస్ తెలిపారు.
వెడ్డింగ్ అయిన తర్వాత, అఖిల్ ఫ్యామిలీ నుంచి అతడి తండ్రి నాగార్జున, తల్లి అమల, అన్నయ్య నాగచైతన్య, వదిన శోభిత ధూళిపాళ సోషల్ మీడియాలో సూపర్ క్యూట్ పిక్స్, హార్ట్ఫెల్ట్ మెసేజెస్ షేర్ చేసి అఖిల్- జైనబ్ జంటకు కంగ్రాట్స్ చెప్పారు. కానీ, ఇంట్రెస్టింగ్గా, అఖిల్ మాత్రం తన ఇన్స్టాగ్రామ్లో వెడ్డింగ్ గురించి సింగిల్ పోస్ట్ కూడా పెట్టలేదు. ఫ్యాన్స్కి ఈ విషయం టోటల్ షాక్ ఇచ్చింది.
గత ఏడాది నిశ్చితార్థం తర్వాత జైనబ్తో ఒక స్వీట్ పిక్ షేర్ చేసిన అఖిల్, అప్పటి నుంచి సోషల్ మీడియాలో సూపర్ లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు. రీసెంట్గా తన అప్కమింగ్ మూవీ “లెనిన్” పోస్టర్ పోస్ట్ చేయడం తప్ప, అతని ఇన్స్టా ఫీడ్లో ఎటువంటి న్యూ యాక్టివిటీ కనిపించడం లేదు. ఇది చూసి అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అఖిల్ వెడ్డింగ్ మూమెంట్స్ని అయినా సోషల్ మీడియాలో షేర్ చేస్తాడని ఫ్యాన్స్ బాగా ఆశించారు, కానీ అతను టోటల్గా పర్సనల్ లైఫ్ని ప్రైవేట్గా ఉంచాలని డిసైడ్ చేసినట్టు కనిపిస్తోంది.
అసలు విషయం ఏంటంటే, అఖిల్ ప్రస్తుతం స్పాట్లైట్ నుంచి దూరంగా ఉండాలని, తన పర్సనల్ స్పేస్ని కాపాడుకోవాలని ట్రై చేస్తున్నాడు. కెరీర్లో కూడా కాస్త లో-ఫేజ్లో ఉన్నాడు. గత కొన్ని ప్రాజెక్ట్స్ అనుకున్న స్టార్డమ్ తీసుకురాలేదు. అందుకే సోషల్ మీడియా ప్రెజెన్స్ని కూడా బాగా తగ్గించేశాడు. అయినా, అభిమానులు అతని వెడ్డింగ్ గ్లింప్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
-
Home
-
Menu