రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్

"అఖండ 2: తాండవం" సినిమా షూటింగ్ ఫుల్ జోష్లో జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీ కోసం ఇటీవల జార్జియాలోని సూపర్ సీనిక్ లొకేషన్స్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు ఈ సినిమా టీమ్ రేపటి నుంచి హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతోంది.
బాలయ్య-బోయపాటి కాంబోలో ఇది నాలుగో సినిమా కావడం విశేషం. గతంలో వీరి కలయికలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. "అఖండ 2" మరింత గ్రాండ్గా, ఇంటెన్స్గా ఉండబోతోందని టీమ్ చెబుతోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని లావిష్గా నిర్మిస్తుండగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.
ఈ ఆర్ఎఫ్సీ షెడ్యూల్లో సినిమాలోని ప్రధాన తారాగణం పాల్గొనబోతోంది. హీరోయిన్గా సంయుక్త నటిస్తుండగా, ఆది పినిశెట్టి ఓ పవర్ఫుల్, ఇంటెన్స్ రోల్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ "అఖండ" సృష్టించిన హైప్ను మరింత పెంచుతూ, మాస్ ఆడియన్స్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ ఇవ్వబోతోంది. "అఖండ 2: తాండవం" ఈ ఏడాది దసరా సీజన్లో.. సెప్టెంబర్ 25న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ ఫెస్టివల్ సమయంలో థియేటర్లలో మాస్ జాతర మొదలవ్వడం ఖాయం.
-
Home
-
Menu