మురుగన్ ఆలయంలో సూర్య 46 టీమ్!

మురుగన్ ఆలయంలో సూర్య 46 టీమ్!కోలీవుడ్ స్టార్ సూర్య తన 46వ చిత్రంతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభానికి ముందు, ఈ రోజు ఉదయం సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగ వంశీ.. తమిళనాడులోని ప్రసిద్ధ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పళని మురుగన్ ఆలయం, దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సూర్య 46 టీమ్ ఈ ఆలయాన్ని సందర్శించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సార్, లక్కీ భాస్కర్ వంటి వరుస విజయాలతో ఉన్న వెంకీ అట్లూరి సూర్య తో చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ మూవీలో సూర్యకి జోడీగా ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు నటిస్తుంది, రవీనా టండన్, రాధికా శరత్కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడిగా, నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్గా, నవీన్ నూలి ఎడిటర్గా ఈ ప్రాజెక్ట్లో భాగమవుతున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం, 2026 వేసవిలో విడుదల కానుంది, జూన్ 9 నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని టీమ్ ఇప్పటికే ప్రకటించింది.
-
Home
-
Menu