భీమవరంలో 'సంక్రాంతికి వస్తున్నాం' సంబరాలు!

వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సంబరాలు జోరుగా కొనసాగుతున్నాయి. విడుదలకు ముందే ఎన్నో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న టీమ్.. విడుదల తర్వాత కూడా అంతకు మించిన జోష్ లో పబ్లిసిటీ నిర్వహిస్తుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.230 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది.
లేటెస్ట్ గా 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ సంబరాలను భీమవరంలో జరపబోతున్నట్టు అధికారిక ప్రకటన విడుదల చేసింది టీమ్. జనవరి 26 సాయంత్రం 5 గంటల నుంచి భీమవరంలో 'సంక్రాంతికి వస్తున్నాం' సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి.
ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వెంకీ కి జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
-
Home
-
Menu