వెంకటేష్ సరసన రుక్మిణి!

'సప్త సాగరాలు దాటి' సిరీస్ తో తెలుగు వారికి పరిచయమైంది రుక్మిణి వసంత్. అసలు అంతకుముందే కన్నడలో 'బీర్బల్ ట్రయాలజీ కేస్ 1'తో హిట్ అందుకుంది. అయితే.. రక్షిత్ శెట్టితో జంటగా నటించిన 'సప్త సాగరాలు దాటి' సిరీస్ మాత్రమే ఈ ముద్దుగుమ్మకు మంచి పేరు తీసుకొచ్చింది. ఒకవిధంగా చెప్పాలంటే 'సప్త సాగరాలు దాటి' రెండు సినిమాలూ థియేట్రికల్ గానూ తెలుగులో పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఓటీటీలో ఈ సిరీస్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో ఆమె క్యూట్ లుక్స్, నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తెలుగులో నిఖిల్ తో రుక్మిణి 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాలో నటించింది. అసలు ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడో వెళ్లిందో తెలియకుండా అయిపోయింది. ఇక శ్రీమురళి, రుక్మిణి వసంత్ 'బఘీర' తెలుగులో ఎలాంటి సౌండ్ చేయలేదు. ప్రశాంత్ నీల్ కథతో వచ్చిన ఈ మూవీ కన్నడలో మాత్రం ప్రాఫిటేబుల్ ప్రాజెక్ట్ గా నిలిచింది. శివారాజ్ కుమార్ తో చేసిన 'భైరతి రణగల్' కూడా కన్నడలో హిట్ టాక్ తెచ్చుకుంది.
విజయ్ సేతుపతితో రుక్మిణి వసంత్ నటించిన 'ఏస్' లేటెస్ట్ గా రిలీజవ్వగా.. శివ కార్తికేయన్-మురుగదాస్ 'మదరాసి' ఇప్పుడు ఈ అమ్మడి కిట్టలో ఉంది. మరోవైపు ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్లో రుక్మిణి నటిస్తుందనే న్యూస్ ఉంది కానీ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు.
మొత్తంగా.. 'మదరాసి, ఎన్టీఆర్-నీల్' ప్రాజెక్ట్స్ తో పాటు ఇప్పుడు రుక్మిణి వరుసగా మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్లను లైన్లో పెడుతుందట. వాటిలో ప్రభాస్ 'స్పిరిట్', మణిరత్నం-నవీన్ పోలిశెట్టి సినిమాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీటితో పాటు లేటెస్ట్ గా వెంకటేష్-త్రివిక్రమ్ సినిమాలోనూ ఈ హోమ్లీ బ్యూటీని నాయికగా ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతుంది.
గతంలో త్రివిక్రమ్ రచయితగా వెంకటేష్ హీరోగా నటించిన 'నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి' ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు తొలిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాని త్వరలో ప్రకటించనున్నారు. ఈ మూవీలో వెంకటేష్-రుక్మిణి జంట ఎలా ఉంటుందో చూడాలి.
-
Home
-
Menu