శేఖర్ తో మరో సినిమా చేస్తా.. నాగార్జున!

నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా ‘కుబేర’. నిన్న విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకుంది టీమ్.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘శేఖర్ దర్శకత్వంలో పనిచేయాలన్నది నా కల. ఆయన చెప్పిన కథలో నా పాత్రకు ఉన్న బలం నన్ను ఆకట్టుకుంది. స్క్రీన్ స్పేస్ కన్నా కథలో పాత్ర ప్రాధాన్యత ముఖ్యం. ఇది డిఫరెంట్ రోల్. శేఖర్ ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాడు‘ అన్నారు. త్వరలో శేఖర్తో మరో సినిమా చేయాలన్న ఆసక్తిని కూడా వ్యక్తం చేశారు కింగ్.
శేఖర్ మాట్లాడుతూ, ‘ఈ కథను చాలా నిజాయితీగా, ఎమోషనల్గా తెరకెక్కించాం. మేము చూపించిన ప్రతి సన్నివేశానికి ఒక ఉద్దేశం ఉంది. నిడివిపై వస్తున్న కామెంట్లను గౌరవిస్తాను, కానీ ఒక్క సీన్ కట్ చేసినా కథలోని ఆత్మ మిస్ అవుతుంది. ఇదే నా బెస్ట్, హానెస్ట్, ఫైనెస్ట్ సినిమా‘ అన్నారు. స్పీచ్ ముగింపు సమయంలో ఆయన కంటతడి పెట్టుకున్నారు.
మొత్తంగా ‘కుబేర‘ చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే విధంగా ఉందనే ప్రశంసలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. నాగార్జున, ధనుష్ నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డులతో సినిమాకు మంచి జోష్ వచ్చింది.
-
Home
-
Menu