మాలీవుడ్ లో అదరగొడుతోన్న టాలీవుడ్ నిర్మాత

టాలీవుడ్ నిర్మాత సాహు గరపాటి టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సక్సెస్ఫుల్ ఫిల్మ్మేకర్. డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 'భగవంత్ కేసరి' లాంటి మాస్ బ్లాక్బస్టర్ హిట్ని ఆడియన్స్కి అందించారు. ఈ హిట్ జోడీ ఇప్పుడు మళ్లీ ఒక సూపర్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ కోసం టీమ్ అప్ అయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'మెగా157' సినిమా 2026 సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సినీ వర్గాల్లో హైప్ క్రియేట్ చేస్తూ, మెగా ఫ్యాన్స్లో ఫుల్ జోష్ నింపుతోంది.
ఇదిలా ఉంటే.. సాహు గరపాటి నిర్మాతగా టాలీవుడ్కే పరిమితం కాకుండా, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కూడా స్టైలిష్గా ఎంట్రీ ఇచ్చారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ విపిన్ దాస్తో కలిసి.. 'వ్యసనసమేతం బంధుమిత్రాదికల్' అనే కూల్ అండ్ క్రిస్పీ హ్యూమరస్ సటైరికల్ ఎంటర్టైనర్ని నిర్మించారు. ఈ మూవీతో సాహు మలయాళంలో తన ఫస్ట్ ఇన్నింగ్స్ని సూపర్ స్టైలీష్గా స్టార్ట్ చేశారు. టాలెంటెడ్ యంగ్ యాక్ట్రెస్ అనస్వర రాజన్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా, విపిన్ దాస్ డైరెక్షన్లో జూన్ 13న కేరళ థియేటర్లలో రిలీజైంది.
ఈ సినిమా అదిరిపోయే రివ్యూల్ని దక్కించుకోవడంతో పాటు, కేరళ బాక్సాఫీస్ వద్ద బలమైన కలెక్షన్స్తో దూసుకుపోతోంది. సినిమా ఫన్నీ టైమింగ్, సటైరికల్ పంచ్లు, అనస్వర రాజన్ యాక్టింగ్తో ఆడియన్స్ని ఫుల్ ఎంగేజ్ చేస్తూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. హైదరాబాద్ మూవీ లవర్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ కేరళ సెన్సేషన్ ఇప్పుడు సిటీలోని కొన్ని టాప్ మల్టీప్లెక్స్లలో స్క్రీన్ అవుతోంది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ ఫన్ రైడ్ని ఎంజాయ్ చేసే ఛాన్స్ దొరికింది.
-
Home
-
Menu