ఈమె హవా మామూలుగా లేదు !

ఈమె హవా మామూలుగా లేదు !
X
ఈ సుందరి, ఇప్పుడు దక్షిణ భారత సినిమా రంగంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ 31వ సినిమాలో నటిస్తున్న ఆమె, తమిళ చిత్రాలు 'ఏస్' మరియు 'మధరాసి'లోనూ భాగమైంది. అసలు ట్విస్ట్ ఏంటంటే, మణిరత్నంతో ఓ కొత్త సినిమా ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హావా ఇప్పుడు మామూలుగా లేదు. 'సప్త సాగరదాచే ఎల్లో' (సైడ్ ఎ, బి) చిత్రాలతో తన అద్భుతమైన నటనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ సుందరి, ఇప్పుడు దక్షిణ భారత సినిమా రంగంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ 31వ సినిమాలో నటిస్తున్న ఆమె, తమిళ చిత్రాలు 'ఏస్' మరియు 'మధరాసి'లోనూ భాగమైంది. అసలు ట్విస్ట్ ఏంటంటే, మణిరత్నంతో ఓ కొత్త సినిమా ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, మణిరత్నం 'థగ్ లైఫ్' తర్వాత ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారు, అందులో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించే ఛాన్స్ ఉంది. అధికారిక ప్రకటన లేనప్పటికీ, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు టాక్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, ఇది చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' షూటింగ్ సమయంలో రుక్మిణి ఏ ఇతర సినిమాల్లోనూ నటించకూడదని కఠినమైన నియమం విధించినట్లు తెలుస్తోంది. ఆమె ఏడాది పాటు పూర్తిగా ఆ ప్రాజెక్ట్‌కు అంకితమవ్వాలని నీల్ డిమాండ్ చేశారని సమాచారం.

ఒకవేళ ఈ వార్త నిజమైతే, మణిరత్నం సినిమా కోసం నీల్ నియమాలు కూడా సడలించినట్లే. రాజమౌళి వంటి దర్శకుల నో-ఓవర్‌లాప్ పాలసీ నుంచి స్ఫూర్తి పొందిన నీల్ నియమం, ఇప్పుడు మొదటిసారి బ్రేక్ అవుతున్నట్టు కనిపిస్తోంది. రుక్మిణి కోసం ఇది ఒక నిర్ణయాత్మక క్షణం కావొచ్చు—నీల్, మణిరత్నం వంటి ఇద్దరు దిగ్గజ దర్శకులతో విభిన్నమైన ప్రాజెక్టుల్లో ఒకేసారి పనిచేసే అవకాశం. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు, కానీ ఈ టాక్ ఒక్కటే ఆమె హవాను చూపిస్తోంది. రుక్మిణి ఇకపై కేవలం రీజినల్ స్టార్ కాదు, మాస్ కమర్షియల్ సినిమాల నుంచి ఎమోషరనల్ డ్రామాల వరకూ అన్నింటినీ సమర్థవంతంగా నడిపించగల పాన్-ఇండియన్ నటిగా రూపొందుతోంది. ఇండస్ట్రీలోని బడా దర్శకులతో ఆమె డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.

Tags

Next Story