'కన్నప్ప' టికెట్ ధరల పెంపు

X
విష్ణు మంచు 'కన్నప్ప' చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు ప్రత్యేక టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చింది.
విష్ణు మంచు 'కన్నప్ప' చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు ప్రత్యేక టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.50 (జీఎస్టీ అదనంగా) వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ ప్రత్యేక ధరలు సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు మాత్రమే అమల్లో ఉంటాయి.
ఈ చిత్రాన్ని విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్గా రూపొందించాడు. దాదాపు పదేళ్లుగా ఈ సినిమాపై శ్రమించాడు. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామాలో రుద్ర పాత్రలో ప్రభాస్, కిరాతగా మోహన్లాల్, శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్, మహదేవ శాస్త్రిగా మోహన్బాబు నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Next Story
-
Home
-
Menu