‘కన్నప్ప’ టీమ్ ఎమోషనల్ వార్నింగ్!

మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’ మరికొద్ది గంటల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో పలు భాషల నుంచి సూపర్ స్టార్స్ కీలకమైన కేమియోలలో కనిపించడంతో పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రంపై బజ్ పెరిగింది.
ఈ సినిమా టీజర్ విడుదలైన సమయంలో విజువల్స్, విష్ణు నటనపై విమర్శలు వెల్లువెత్తాయి. యూట్యూబ్ రివ్యూవర్లు వ్యంగ్యంగా స్పందించారు. అయితే టీజర్ తర్వాత విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై నెగెటివ్ వైబ్ను తగ్గించాయి. ఇప్పుడు సినిమా విడుదలవుతుండటంతో టీమ్ ఓ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.
ఈ నోట్ లో ఎవరైనా కావాలని సినిమాను లక్ష్యంగా చేసుకుని నెగెటివ్ రివ్యూలు ఇస్తే, బేస్లెస్ కామెంట్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గతంలో టీజర్పై వచ్చిన ట్రోలింగ్ సమయంలో యూట్యూబ్ ఛానెల్స్పై స్ట్రైక్స్ వేసినట్టు ఆరోపణలు రావడం, ఆపై ట్రోల్స్ తగ్గిపోవడం ఇప్పుడీ నోటీసుతో మళ్లీ చర్చకు వచ్చింది.
కథ పరంగా మంచు విష్ణు తిన్నడు పాత్రలో కనిపించనున్నాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ పార్వతి దేవిగా, ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించబోతున్నారు. మోహన్ బాబు, బ్రహ్మానందం, మోహన్ లాల్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. విశేషం ఏమిటంటే ఈ సినిమాలో విష్ణు, మోహన్ బాబు లతో పాటు విష్ణు ఇద్దరు కూతుళ్లు, కొడుకు కూడా బాలనటులుగా పరిచయం అవుతున్నారు. మొత్తంగా.. బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్న ‘కన్నప్ప‘కు రేపు థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
-
Home
-
Menu