'కన్నప్ప' కలెక్షన్ల జోరు

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. నిన్న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం విడుదలైంది.
ఈ సినిమాకు రూ.120 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.90 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, రూ.180 కోట్ల గ్రాస్ వసూళ్లు అవసరం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో విడుదలైన ఈ చిత్రం 5250 థియేటర్లలో ప్రదర్శించబడుతోంది.
అడ్వాన్స్ బుకింగ్స్ లో 'కన్నప్ప'కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ 24 గంటల్లోనే బుక్ మై షో లో 1.65 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో 'కన్నప్ప' వసూళ్లు శని, ఆదివారాలలో బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 'కన్నప్ప' ఎలాంటి వసూళ్లు సాధిస్తుందా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
సినిమా విడుదలైన వెంటనే ప్రేక్షకులు, సినీ ప్రముఖులు 'కన్నప్ప'ను మెచ్చుకుంటున్నారు. మంచు విష్ణు నటన, విజువల్స్, కథ చెప్పే తీరుపై ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ సినిమాతో విష్ణు తన కష్టానికి తగిన ఫలితం అందుకున్నారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
-
Home
-
Menu