జయం రవి–కెనీషా పెళ్లి చేసుకున్నారా?

కోలీవుడ్ నటుడు జయం రవి, సింగర్ కెనీషా చెన్నైలోని ఓ ప్రసిద్ధ మురుగన్ ఆలయాన్ని కలిసి సందర్శించడం ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. పూజ అనంతరం ఆలయ అర్చకులతో దిగిన ఫోటోల్లో ఇద్దరి మెడలోనూ పూలదండలు కనిపించడంతో, వీరిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, జయం రవి వ్యక్తిగత జీవితం మరోసారి హైలైట్ అయింది. గురువారం తన సొంత బ్యానర్ ‘రవి మోహన్ స్టూడియోస్’ ప్రారంభానికి ముందు ఆలయ సందర్శన చేశారు. ఇది సాధారణ పూజా కార్యక్రమమా? లేదా మరేదైనా ప్రత్యేక సందర్భమా? అనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.
ఇదిలా ఉంటే, జయం రవి గతేడాది తన భార్య ఆర్తితో విడాకులపై అధికారికంగా ప్రకటించారు. ఆర్తి, కెనీషా మధ్య ఉన్న సంబంధమే విడాకులకు కారణమంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఇటీవల చెన్నైలోని ఓ పెళ్లికి జంటగా హాజరైన రవి, కెనీషా. ఇక ఆర్తి, తనకు అన్యాయం జరిగిందంటూ ఎమోషనల్ పోస్ట్లు చేయడం, రవి ఆర్తిపై నియంత్రణ ఆరోపణలు చేయడం వంటివి వివాదాన్ని మరింత వేడెక్కించాయి.
ప్రస్తుతం ఆర్తి, నెలకు రూ.40 లక్షల భరణం కోరుతూ కోర్టును ఆశ్రయించగా, విడాకుల కేసు న్యాయస్థానంలో పరిష్కారానికి నోచుకోని దశలో ఉంది. అలాంటి సమయంలో జయం రవి, కెనీషా ఆలయ దర్శనం వివిధ ఊహాగానాలకు తావిస్తోంది. వీరిద్దరి సంబంధాన్ని సంబంధిత పక్షాలు అధికారికంగా నిర్ధారించకపోయినా.. ఇటీవలి పరిణామాలు మాత్రం మౌనంగానే చాలా విషయాలు చెబుతున్నాయనిపిస్తోంది.
-
Home
-
Menu