తమిళ రీమేక్కి గ్రీన్ సిగ్నల్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన కెరీర్లో కీలక మైలురాయిగా నిలిచే వందో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తమిళ దర్శకుడు రా. కార్తీక్ చెప్పిన ఆసక్తికరమైన కథను నాగ్ ఓకే చేశాడు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
మరోవైపు నాగార్జున తమిళ హిట్ మూవీ ‘అయోతి’ రీమేక్కి కూడా సన్నద్ధమవుతున్నాడట. శశికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మెలోడ్రామాటిక్ ఫిల్మ్ 2023లో విడుదలై విమర్శకుల ప్రశంసలు, కమర్షియల్ సక్సెస్ను సొంతం చేసుకుంది. దీనిని తెలుగులో రీమేక్ చేసేందుకు ట్రిడెంట్ ఆర్ట్స్ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై చర్చలు జరగుతున్నాయి.
మొత్తానికి తన వందో చిత్రం, ఆ తర్వాత చేయబోయే సినిమా రెండూ తమిళ దర్శకులతోనే చేయనుండటం విశేషం. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ నాగార్జున పుట్టినరోజైన ఆగస్టు 29న రానున్నాయట. ఇక ఆగస్టు 14న నాగార్జున కీలక పాత్రలో నటించిన 'కూలీ' వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతుంది.
-
Home
-
Menu